Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanti Velugu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సోమవారం నుంచి పదిరోజుల పాటు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
Read Also: Dog Dispute: తమిళనాడులో అంతే.. కుక్కని కుక్క అనకూడదా..?
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్ ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలీయన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
Read Also:Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..
అలాగే ఏ.వీ. కళాశాలలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమ శిబిరాన్ని సీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటివెలుగు కార్యక్రమంలో ప్రపంచరికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి 15,000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితో కూడిన 1,500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!