Opposition Alliance: యూపీఏ మాయం కానుందా..? కొత్త పేరు అదేనా..? కెప్టెన్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Alliance: యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు కూటమికి కొత్త పేరుపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి దీటుగా దేశభక్త ప్రజాస్వామిక కూటమి అనే పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయెన్స్-పీడీఏ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో కొత్త జట్టు పేరును మెజారిటీ పార్టీలు అంగీకరించాయని సమాచారం. పీడీఏ పేరును సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా గట్టిగా సమర్థించినట్టు తెలిసింది. వచ్చే నెలలో సిమ్లాలో జరిగే భేటీలో కొత్తపేరు మీద క్లారిటీ వస్తుందని జాతీయ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీఏ కన్వీనర్గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందు కృషిచేస్తున్న నితీష్ కుమార్.. ఆమె స్థానంలో కూటమికి నేతృత్వం వహిస్తారని కాంగ్రెసేతర విపక్షాలు చెబుతున్నాయి. అయితే యూపీఏ రద్దును కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి.
Read Also: Kurnool Crime: కర్నూల్లో మెడికో ఆత్మహత్య..
19 ఏళ్లుగా యూపీయే కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త కూటమిలో అంతే గౌరవం దక్కుతుందా.. ఓ ప్రాంతీయ పార్టీ నేత నాయకత్వాన్ని జాతీయ పార్టీ ఆమోదిస్తుందా అనే సందేహంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. యూపీఏ ఇప్పటికీ ఉనికిలోనే ఉందని, సోనియా సారథిగా వున్నారని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కొత్త కూటమి పేరు పట్నా భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్పే వాళ్లమని ఆర్జేడీ అంటోంది. మరోవైపు విపక్షాల కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరడం ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఆ పార్టీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. రాహుల్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమతో సయోధ్య కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆప్ నాయకత్వానికి అర్థమైంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!