Opposition Alliance: యూపీఏ మాయం కానుందా..? కొత్త పేరు అదేనా..? కెప్టెన్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Alliance: యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు కూటమికి కొత్త పేరుపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి దీటుగా దేశభక్త ప్రజాస్వామిక కూటమి అనే పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయెన్స్-పీడీఏ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో కొత్త జట్టు పేరును మెజారిటీ పార్టీలు అంగీకరించాయని సమాచారం. పీడీఏ పేరును సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా గట్టిగా సమర్థించినట్టు తెలిసింది. వచ్చే నెలలో సిమ్లాలో జరిగే భేటీలో కొత్తపేరు మీద క్లారిటీ వస్తుందని జాతీయ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీఏ కన్వీనర్గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందు కృషిచేస్తున్న నితీష్ కుమార్.. ఆమె స్థానంలో కూటమికి నేతృత్వం వహిస్తారని కాంగ్రెసేతర విపక్షాలు చెబుతున్నాయి. అయితే యూపీఏ రద్దును కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి.
Read Also: Kurnool Crime: కర్నూల్లో మెడికో ఆత్మహత్య..
19 ఏళ్లుగా యూపీయే కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త కూటమిలో అంతే గౌరవం దక్కుతుందా.. ఓ ప్రాంతీయ పార్టీ నేత నాయకత్వాన్ని జాతీయ పార్టీ ఆమోదిస్తుందా అనే సందేహంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. యూపీఏ ఇప్పటికీ ఉనికిలోనే ఉందని, సోనియా సారథిగా వున్నారని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కొత్త కూటమి పేరు పట్నా భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్పే వాళ్లమని ఆర్జేడీ అంటోంది. మరోవైపు విపక్షాల కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరడం ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఆ పార్టీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. రాహుల్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమతో సయోధ్య కాంగ్రెస్కు ఇష్టం లేదని ఆప్ నాయకత్వానికి అర్థమైంది.
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!