Mukesh Ambani: జీతాలు లేకుండానే పనిచేస్తున్న అంబానీ వారసులు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు వాటాదారుల అనుమతి కోరుతూ ఓ ప్రపోజల్ను డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ముకేశ్ అంబానీలాగే సంపాదించే లాభాలపై వారు కమీషన్ పొందుతారు. ముకేశ్ అంబానీ(66) 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదు. ముఖేశ్ అంబానీ స్వయంగా ఐదేళ్ల పాటు ఛైర్మన్గా, సీఈవోగా కొనసాగుతారు. తాజాగా బోర్డులో చేరిన ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలకు సైతం జీతం ఉండదు. ఆయన బంధువులు నిఖిల్, హితల్తో సహా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు జీతం, అనుమతులు, అలవెన్సులు, కమీషన్ చెల్లిస్తారు.
Also Read: World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఆయన ముగ్గురు పిల్లలు – కవలలు ఆకాష్, ఇషా (ఇద్దరూ 31 సంవత్సరాలు), అనంత్ (28 సంవత్సరాలు) – కేవలం సిట్టింగ్ ఫీజు, సంస్థ సంపాదించిన లాభంపై కమీషన్ పొందుతారు. ముఖేశ్ అంబానీ తన విశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచారు. ఇషా అంబానీ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా.. ఆకాష్ టెలికాం విభాగాన్ని చూసుకుంటున్నారు. చిన్నవాడైన అనంత్ కొత్త ఇంధన వ్యాపారానికి సారథ్యం వహిస్తున్నారు. ముఖేశ్ అంబానీ పిల్లలు గతేడాది నుంచి రిలయన్స్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది రిలయన్స్ బోర్డులోకి అనుమతించారు. గత నెలలో రిలయన్స్ వార్షిక సమావేశం (AGM) జరుగగా, అందులో ఇషా అంబానీ, అనంత్, ఆకాశ్ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డులో నియామకమైన వీరు డైరెక్టర్స్ హోదాలో పని చేయనున్నారు. వారి తల్లి నీతా అంబానీ 2014లో ఆర్ఐఎల్ బోర్డులో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమెకు జీతం కూడా లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సమావేశానికి హాజరైనందుకు నీతా అంబానీకి పారితోషికం కింద రూ.6 లక్షలు. కమీషన్ కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Also Read: Disney+ Hotstar: పాస్వర్డ్ షేరింగ్కి హాట్స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
వారసత్వ ప్రణాళికలో భాగంగా, నీతా రిలయన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా చేయబడ్డారు. ఈ హోదాను బోర్డులో ఎవరూ అనుభవించరు. ముఖేష్ అంబానీ, ఇతర డైరెక్టర్లు తమ కంటే ఎక్కువ పొడిగింపు కోసం వాటాదారుల అనుమతి అవసరం. ప్రస్తుతం ఆమె శాశ్వతంగా బోర్డులో కొనసాగుతారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!