Mukesh Ambani: జీతాలు లేకుండానే పనిచేస్తున్న అంబానీ వారసులు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు వాటాదారుల అనుమతి కోరుతూ ఓ ప్రపోజల్ను డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ముకేశ్ అంబానీలాగే సంపాదించే లాభాలపై వారు కమీషన్ పొందుతారు. ముకేశ్ అంబానీ(66) 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదు. ముఖేశ్ అంబానీ స్వయంగా ఐదేళ్ల పాటు ఛైర్మన్గా, సీఈవోగా కొనసాగుతారు. తాజాగా బోర్డులో చేరిన ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలకు సైతం జీతం ఉండదు. ఆయన బంధువులు నిఖిల్, హితల్తో సహా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు జీతం, అనుమతులు, అలవెన్సులు, కమీషన్ చెల్లిస్తారు.
Also Read: World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ఆయన ముగ్గురు పిల్లలు – కవలలు ఆకాష్, ఇషా (ఇద్దరూ 31 సంవత్సరాలు), అనంత్ (28 సంవత్సరాలు) – కేవలం సిట్టింగ్ ఫీజు, సంస్థ సంపాదించిన లాభంపై కమీషన్ పొందుతారు. ముఖేశ్ అంబానీ తన విశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచారు. ఇషా అంబానీ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా.. ఆకాష్ టెలికాం విభాగాన్ని చూసుకుంటున్నారు. చిన్నవాడైన అనంత్ కొత్త ఇంధన వ్యాపారానికి సారథ్యం వహిస్తున్నారు. ముఖేశ్ అంబానీ పిల్లలు గతేడాది నుంచి రిలయన్స్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది రిలయన్స్ బోర్డులోకి అనుమతించారు. గత నెలలో రిలయన్స్ వార్షిక సమావేశం (AGM) జరుగగా, అందులో ఇషా అంబానీ, అనంత్, ఆకాశ్ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డులో నియామకమైన వీరు డైరెక్టర్స్ హోదాలో పని చేయనున్నారు. వారి తల్లి నీతా అంబానీ 2014లో ఆర్ఐఎల్ బోర్డులో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమెకు జీతం కూడా లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సమావేశానికి హాజరైనందుకు నీతా అంబానీకి పారితోషికం కింద రూ.6 లక్షలు. కమీషన్ కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Also Read: Disney+ Hotstar: పాస్వర్డ్ షేరింగ్కి హాట్స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
వారసత్వ ప్రణాళికలో భాగంగా, నీతా రిలయన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా చేయబడ్డారు. ఈ హోదాను బోర్డులో ఎవరూ అనుభవించరు. ముఖేష్ అంబానీ, ఇతర డైరెక్టర్లు తమ కంటే ఎక్కువ పొడిగింపు కోసం వాటాదారుల అనుమతి అవసరం. ప్రస్తుతం ఆమె శాశ్వతంగా బోర్డులో కొనసాగుతారు.
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!