Mukesh Ambani: జీతాలు లేకుండానే పనిచేస్తున్న అంబానీ వారసులు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు వాటాదారుల అనుమతి కోరుతూ ఓ ప్రపోజల్ను డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ముకేశ్ అంబానీలాగే సంపాదించే లాభాలపై వారు కమీషన్ పొందుతారు. ముకేశ్ అంబానీ(66) 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదు. ముఖేశ్ అంబానీ స్వయంగా ఐదేళ్ల పాటు ఛైర్మన్గా, సీఈవోగా కొనసాగుతారు. తాజాగా బోర్డులో చేరిన ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలకు సైతం జీతం ఉండదు. ఆయన బంధువులు నిఖిల్, హితల్తో సహా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు జీతం, అనుమతులు, అలవెన్సులు, కమీషన్ చెల్లిస్తారు.
Also Read: World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఆయన ముగ్గురు పిల్లలు – కవలలు ఆకాష్, ఇషా (ఇద్దరూ 31 సంవత్సరాలు), అనంత్ (28 సంవత్సరాలు) – కేవలం సిట్టింగ్ ఫీజు, సంస్థ సంపాదించిన లాభంపై కమీషన్ పొందుతారు. ముఖేశ్ అంబానీ తన విశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచారు. ఇషా అంబానీ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా.. ఆకాష్ టెలికాం విభాగాన్ని చూసుకుంటున్నారు. చిన్నవాడైన అనంత్ కొత్త ఇంధన వ్యాపారానికి సారథ్యం వహిస్తున్నారు. ముఖేశ్ అంబానీ పిల్లలు గతేడాది నుంచి రిలయన్స్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది రిలయన్స్ బోర్డులోకి అనుమతించారు. గత నెలలో రిలయన్స్ వార్షిక సమావేశం (AGM) జరుగగా, అందులో ఇషా అంబానీ, అనంత్, ఆకాశ్ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డులో నియామకమైన వీరు డైరెక్టర్స్ హోదాలో పని చేయనున్నారు. వారి తల్లి నీతా అంబానీ 2014లో ఆర్ఐఎల్ బోర్డులో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమెకు జీతం కూడా లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సమావేశానికి హాజరైనందుకు నీతా అంబానీకి పారితోషికం కింద రూ.6 లక్షలు. కమీషన్ కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Also Read: Disney+ Hotstar: పాస్వర్డ్ షేరింగ్కి హాట్స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
వారసత్వ ప్రణాళికలో భాగంగా, నీతా రిలయన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా చేయబడ్డారు. ఈ హోదాను బోర్డులో ఎవరూ అనుభవించరు. ముఖేష్ అంబానీ, ఇతర డైరెక్టర్లు తమ కంటే ఎక్కువ పొడిగింపు కోసం వాటాదారుల అనుమతి అవసరం. ప్రస్తుతం ఆమె శాశ్వతంగా బోర్డులో కొనసాగుతారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!