Nara Lokesh: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది.. వైసీపీ నేతలే చెబుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది.. ఆ విషయాన్ని అధికార వైసీపీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్లో కలిసిన ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదు.. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు.. ఇక, చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. వైసీపీ నేతల ఈ విషయం చెబుతున్నారు.. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. నా తల్లి భువనేశ్వరీ పై కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారన్న ఆయన.. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులు గడిచిన ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేదని మండిపడ్డారు.
Read Also: Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..
Also Read
చంద్రబాబు అవినీతి చేస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని ఆరోపించిన ఆయే.. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం.. అవినీతి చేసిన వ్యక్తి పదిహేళ్లుగా బయట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.. చంద్రబాబును చంపుతామని మావోయిస్టులు లేఖ రాసిన ప్రభుత్వం స్పందించడంలేదన్నారు లోకేష్.. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఆయన ఆరు కిలోలు బరువు తగ్గటం వాస్తవం అన్నారు. అధికారులు ఒకటి చెప్తారు.. వైద్యులు మరొకటి చేస్తారన్నారు. జైలు అధికారులకు కూడా స్వేచ్ఛ ఉన్నట్లు లేదన్నారు. ఈ వ్యవస్థ పై మాకు నమ్మకం లేదన్నారు.. ఏసీ బస్సుల్లో తిరిగితే అన్యాయం న్యాయం కాదు కదా? అని ప్రశ్నించారు నారా లోకేష్.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?