Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్ జగన్ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి.. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వర్షాభావం వలన పంట పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఈ సంవత్సరం రైతులు సుమారు 40 వేల ఎకరాలు సాగుచేయలేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. ముఖ్యమంత్రి వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని కోరారు.
Read Also: Nallapareddy: దొంగ ఏడుపులు ఏడ్చినా.. దత్తపుత్రుడుతో కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు..!
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ఇక, నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గిడుగు రుద్రరాజు. ఇటీవల చిగ్బల్లాపూర్ లో ఏపీ రైతులు వలసపోతూ రోడ్డుప్రమాదంలో చనిపోవడం బాధాకరం అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది.. ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేయాలి.. మన రాష్ట్రంలో ఉపాధిలేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.. కరువు జిల్లాలు, మండలాలు ప్రకటించాలి.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. సమాజంలో కులగణన జరిగితే.. ఆ సంఖ్యా బలాన్ని బట్టి ఆయా కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. రేపు గుంటూరులో ఓబీసీ సమావేశం నిర్వహించనున్నాం.. ఏపీ కాంగ్రెస్ లో మంచి నాయకులు ఉన్నారు.. రానున్న రోజుల్లో సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!