Nara Lokesh Delhi Tour: ఢిల్లీకి నారా లోకేష్.. విషయం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Delhi Tour: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కాకరేపుతోంది.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కామ్కు పాల్పడ్డారు.. ఇవిగో ఆధారాలు అని చూపిస్తున్నారు. అయితే, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ.. దాని కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు.. రాజమండ్రి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడనున్నారట లోకేష్.. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్గా తెలుస్తోంది.
Read Also: Madhavi Latha: కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చించనున్నారని సమాచారం.. పార్లమెంటులో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం సిద్ధం చేసిందట.. చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేష్ మాట్లాడనున్నారట. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్ వెంట.. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మరో ముగ్గురు కూడా ఉన్నారు.. చంద్రబాబు అరెస్టు, ఆ కేసుపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. కేంద్ర పెద్దల అపాయింట్మెంటగ్ కోరారని.. అవకాశం లభిస్తే కలుస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి..
Read Also: Perni Nani: ఇది ములాఖత్ కాదు.. మిలాఖత్..! పవన్ సెటిల్మెంట్ కోసమే వెళ్లాడు..
ఇక, 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని రాజమండ్రిలో నారా లోకేష్ ప్రకటించిన విషయం విదితమే.. పవన్ కల్యాణ్, బాలకృష్ణతో కలిసి వెళ్లి ములాఖత్లో తన తండ్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన ఆయన.. ఆ తర్వాత.. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నాం.. రెండు పార్టీల నుంచి కమిటీ వేసి పోరాటాలపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అవసరం రాష్ట్రానికి ఉందని.. దాని కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. బీజేపీ వస్తారో రారో వాళ్లు తేల్చుకోవాలని సూచించారు నారా లోకేష్.
తాజావార్తలు
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!