Dr. Laxman: అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. సినిమాలో చూపించినట్లు కోడిని దూలానికి వేలాడదీసి భోజనం పెట్టించినట్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఉందని విమర్శించారు.
Konda Vishweshwar Reddy : ఎరువుల నుంచి శ్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవే
Also Read
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
పేదరికం, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మోడీ.. మహిళల కష్టాలు మోడీకి తెలుసని లక్ష్మణ్ తెలిపారు. మోడీ అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తున్నారని.. పేదవాడు దేశ ప్రధాని అయ్యిండు.. దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్.. కల్వకుంట్ల కుటుంబం కోసం, గాంధీల కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. మరోవైపు.. తెలంగాణ రైల్వే కోసం మోడీ రూ. 4500 కోట్లు కేటాయించారని అన్నారు.
Revanth Reddy : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధాన
రాహుల్ గాంధీకి పేదల బ్రతుకుల గురించి తెలియదని లక్ష్మణ్ అన్నారు. జోడోయాత్ర పేరుతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని.. రాహుల్ యాత్ర వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు వల్లే అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలన బీఆర్ఎస్ ది.. దాన్ని నమ్మి ప్రజలు మళ్ళీ మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము.. దాన్ని మెడలో వేసుకునే ఉద్దేశ్యం బీజేపీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలు చెల్లవని… దేశంలో చెల్లెవి మోడీ గ్యారెంటీలేనని పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి.. అతన్ని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..