Dr. Laxman: అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. సినిమాలో చూపించినట్లు కోడిని దూలానికి వేలాడదీసి భోజనం పెట్టించినట్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఉందని విమర్శించారు.
Konda Vishweshwar Reddy : ఎరువుల నుంచి శ్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవే
Also Read
పేదరికం, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మోడీ.. మహిళల కష్టాలు మోడీకి తెలుసని లక్ష్మణ్ తెలిపారు. మోడీ అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తున్నారని.. పేదవాడు దేశ ప్రధాని అయ్యిండు.. దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్.. కల్వకుంట్ల కుటుంబం కోసం, గాంధీల కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. మరోవైపు.. తెలంగాణ రైల్వే కోసం మోడీ రూ. 4500 కోట్లు కేటాయించారని అన్నారు.
Revanth Reddy : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధాన
రాహుల్ గాంధీకి పేదల బ్రతుకుల గురించి తెలియదని లక్ష్మణ్ అన్నారు. జోడోయాత్ర పేరుతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని.. రాహుల్ యాత్ర వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు వల్లే అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలన బీఆర్ఎస్ ది.. దాన్ని నమ్మి ప్రజలు మళ్ళీ మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము.. దాన్ని మెడలో వేసుకునే ఉద్దేశ్యం బీజేపీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలు చెల్లవని… దేశంలో చెల్లెవి మోడీ గ్యారెంటీలేనని పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి.. అతన్ని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!