సీఎం రేవంత్ ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని, అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని, తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 64ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామని, స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామని, తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు.. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Vedhika: వేదిక పుట్టినరోజు సందర్భంగా “ఫియర్” మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొండగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్లో కోస్గి చేరుకోనున్న సీఎం రేవంత్.. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.