PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్
- నేడు మోడీ సమక్షంలో బీజేపీ అగ్రనేతల సమావేశం
- 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు
- అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంపై చర్చ
- అభివృద్ధి చెందిన భారతదేశం అంశంపై ప్రధాని ఉద్ఘాటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆదివారం వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి సమన్వయంపై ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.
READ MORE: VIDEO: కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఈ ముఖ్యమైన సమావేశంలో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంపై చర్చించారు. దీంతో పాటు నూతన విద్యా విధానంపై మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అదే సమయంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. రెండు రోజుల ‘ముఖ్యమంత్రి మండలి’ శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
READ MORE:Kerala High Court: మతంతో సంబంధం లేదు.. “బాల్య వివాహాల నిషేధ చట్టం” అందరికీ వర్తిస్తుంది..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేద సంక్షేమ పథకాలను తారుమారు చేయరాదని, పథకంలో ఎలాంటి తగ్గింపు చేయరాదని లేదా ఏమీ జోడించకూడదని ప్రధాని మోదీ సమావేశంలో అన్నారు. ఉదాహరణకు, ప్రధాన మంత్రి అన్న యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 5 కిలోల ధాన్యం ఇస్తోంది, అప్పుడు అంత ధాన్యం ఇవ్వాలి. ఇందులో ఏ ఆహార పదార్థాన్ని పెంచకూడదు, తగ్గించకూడదు.
READ MORE: Rainbow Children’s Hospital: అగ్రగామి ఫార్మా కంపెనీలతో అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..
ప్రధాని మోదీ ఈ టాస్క్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో 100 శాతం అమలు చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. ప్రభుత్వం పథకాలను నిశితంగా పరిశీలించి.. ప్రజలపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేస్తుందని, అందుకే అందులో ఎలాంటి మార్పులు చేయరాదని ప్రధాని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా వ్యాప్తి చెందేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటిని సుపరిపాలనకు ఉదాహరణలుగా చూపాలన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు, ముఖ్యంగా పేదలకు సహాయం చేసేందుకు బీజేపీ పాలిత ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మండలి సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), సిఎం హిమంత బిస్వా శర్మ (అస్సాం), సిఎం భజన్లాల్ శర్మ (రాజస్థాన్), సిఎం మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా)తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, మణిపూర్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..