Kerala High Court: మతంతో సంబంధం లేదు.. “బాల్య వివాహాల నిషేధ చట్టం” అందరికీ వర్తిస్తుంది..
- మతంతో బాల్య వివాహాలకు సంబంధం లేదు..
- దేశంలో ప్రతీ ఒక్కరికి ‘‘బాల్యవివాహాల నిషేధ చట్టం’’ వర్తిస్తుంది..
- కేరళ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: బాల్య వివాహాల నిషేధ చట్టం -2006, ఈ దేశంలో ప్రతీ పౌరుడికి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతీ భారతీయుడు ముందుగా పౌరుడు ఆ తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని చెప్పింది. బాల్యవివాహాలపై పాలక్కాడ్లో 2012లో నమోదైన కేసును కొట్టేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ వీవీ కున్నికృష్ణన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్ తదితర మతాలకు అతీతంగా ఈ చట్టం వర్తిస్తుందని అన్నారు.
ముస్లిం అయిన బాలికకు యుక్తవయసు అంటే 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉందని ఆమె తండ్రితో సహా పిటిషనర్లు కోర్టు ముందు వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ‘‘ఒక వ్యక్తి మొదట భారతీయ పౌరుడిగా ఉండాలి. ఆపై అతని మతం తర్వాత వస్తుంది. మతానికి ముందు పౌరసత్వం మొదలు. కాబట్టి, మతంతో సంబంధం లేకుండా వ్యక్తి హిందువు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ అయినా ఈ బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 అందరికి వర్తిస్తుంది’’ అని కోర్టు జూలై 15 ఆర్డర్లో పేర్కొంది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
Read Also: Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
బాల్య వివాహాలు బాలికల చదువు, ఆరోగ్యం వంటి ప్రాథమిక మానవహక్కుల్ని కాలరాస్తాయని, శిశుమరణాలు, ప్రసూతి మరణాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని కోర్టు చెప్పింది. బాల్యంలో పెళ్లైతే బాలికలు గృహ హింస, దుర్వినియోగానికి గురవుతారు, సమాజాల ఆర్థిక అవకాశాలను పరిమితం చేస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు మానసిక గాయాలకు దారి తీయవచ్చు, సామాజిక ఒంటరితనానికి, కుటుంబాన్ని సమాజం నుంచి వేరు చేస్తుందని, అంతర్జాతీయ మానవహక్కుల్ని ఉల్లంఘిస్తాయని కోర్టు తన 37 పేజీల ఆర్డర్లో పేర్కొంది.
దశాబ్దాల క్రితం బాల్య వివాహాల నిషేధ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కేరళలో బాల్య వివాహాలపై ఆరోపణలు రావడం బాధాకరమని కోర్టు పేర్కొంది. బాల్యవివాహాల నిషేధ చట్టం వచ్చినప్పటికీ, మహ్మదీయ చట్టం ప్రకారం యుక్తవయసుకు వచ్చిన తర్వాత ముస్లిం యువతికి వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉందంటూ ఇక్కడికి పిటిషనర్లు సమర్థించడం బాధాకరమని కోర్టు చెప్పింది. పిల్లలను వారి ఇష్టానుసారం చదువుకోవడానికి, ప్రయాణం చేయడానికి , వారి జీవితాన్ని ఆనందించడానికి అనుమతించాలని, వారు పరిపక్వత వచ్చిన తర్వాత, వారి వివాహం గురించి నిర్ణయించుకోనివ్వాలని హైకోర్టు సమాజాన్ని కోరింది. బాల్య వివాహాల వల్ల వచ్చే నష్టాలను ఎత్తిచూపడం మీడియా బాధ్యతగా కోర్టు ఆర్డర్ చెప్పింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!