MLC Jeevan Reddy : దళితులకు చెందాల్సిన 40 వేల కోట్లను కేసీఆర్ పక్కదారి పట్టించిండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయికల్ మండలం ఇటిక్యాలలో గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయంను ప్రారంభించి అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మస్కట్ పోయేటోళ్లనే పాస్ పోర్టుల పేరుతో మోసం చేసిన వ్యక్తి దళితబంధు ఇస్తాడని ఎలా నమ్ముతాం..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, నేను కలిసి చదువుకున్నాం, నాకు ఆయన గురించి బాగా తెలుసు అని ఆయన వెల్లడించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు కట్టించడం వంటి హామీలు తుంగలో తొక్కిండని ఆయన విమర్శించారు. అంతేకాదు, అంబేద్కర్ దయతో రాజ్యాంగపరంగా దళితులకు చెందాల్సిన 40 వేల కోట్ల ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ ను కూడా పక్కదారి పట్టించిండని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు ఆలోచించాలన్నారు జీవన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు అందించామని, కేసీఆర్ బియ్యం తప్పా అన్ని రద్దు చేసిండన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, తమను ఆదరించి, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
Also Read : Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..
Also Read
సింగరేణికి కేటాయించిన గనుల్లో బొగ్గు తీయకపోవడం, గనులను విస్తరించకపోవడంతో కార్మికుల సంఖ్య 60 వేల నుంచి 43 వేలకు తగ్గిపోయిందన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం ప్రైవేట్ పరం చేయదని పేర్కొన్నారు. ఒకప్పుడు 35,000 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పుల్లో ఉందని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ చర్చ లేకుండా ఉండేందుకే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీని తెరమీదికి తెచ్చారని, కానీ అసలు సమస్య టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీయేనని అన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్రదారులేనని ఆరోపించారు.
Also Read : Jagadish Reddy: తెలంగాణలో ఎకరం అమ్మి.. ఆంధ్రలో 100 ఎకరాలు కొనొచ్చు..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!