Botsa Satyanarayana: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు. మిడ్ డే మీల్స్ లోపాలపై ఒక్క సమీక్ష అయిన జరిగిందా అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. జూన్ 12న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని తెలిపారు. విద్యార్థులు, వాళ్లకు పంపిణీ చేసే ఆహారం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని.. దీనికి గత ప్రభుత్వానిదే బాధ్యత అని తప్పించుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Tragedy: మరో తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఒక్క ఘటనలో కఠినమైన చర్యలు తీసుకుని వుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు.ఇన్ని జరుగుతుంటే విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎసెన్షియా ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. రేపటీలోగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయినజిల్లాల్లో వైసీపీ శ్రేణులు సహాయచర్యలలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు ఉండాలని కోరారు. మిడ్ డే మీల్స్ ధరలు పెరిగితే సమీక్షించుకుని సవరించుకోవడం ప్రభుత్వం బాధ్యత అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు, నాయకుల చర్యల వల్ల పార్టీకి నష్టం జరిగితే.. పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!