CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన
- కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సాయం
- కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన స్టాలిన్
- తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను..
- సహాయక చర్యలు చేపట్టేందుకు నియామకం.
వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఆయన ‘ఎక్స్’లో “వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడటం.. తత్ఫలితంగా ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు. నేను ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాను. పూర్తి స్వింగ్ వారందరినీ కాపాడుతుంది, ఈ సంక్షోభ సమయంలో సోదర రాష్ట్రమైన కేరళకు అవసరమైన లాజిస్టికల్ లేదా మానవశక్తి మద్దతును అందించడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. అని తెలిపారు. తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సహాయక చర్యలు చేపట్టేందుకు నియమించారు. సీఎం స్టాలిన్ మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి సహాయ, సహాయక చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
ఇదిలా ఉంటే.. ఒక డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 20 మంది అగ్నిమాపక సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్, 20 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం.. 10 మంది సభ్యుల వైద్య బృందం వయనాడ్లో సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు.. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే కొండచరియలు విరిగిపడి గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో