JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
- నిపా వైరస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
- నిపా.. కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి- నడ్డా
- జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయి- జేపీ నడ్డా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిపా వైరస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
Read Also: Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
‘గత కొన్ని దశాబ్దాలుగా.. జంతువులతో సంపర్కం నుండి అనేక అంటువ్యాధుల ఉద్భవించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదించిందని నడ్డా తెలిపారు. దీంతో ఆరోగ్య రంగంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చాయని.. ఇది ప్రపంచ స్థాయిలో ఆందోళన కలిగించిందని చెప్పారు. 2011లో బంగ్లాదేశ్, భారత్లో నిపా వైరస్ వ్యాపించిందని అన్నారు. అంతే కాకుండా.. హాంకాంగ్లో 2002-03లో SARS (SARS), 2005లో H5N1, 2009లో H1N1, 2012లో MERS (MERS), 2014లో Zika వైరస్.. 2019లో COVID-19 వ్యాపించిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
Read Also: Lavanya Audio: లావణ్య -మస్తాన్ సాయిల ఆడియో లీక్.. అంతకు మించి అంటూ!
ఈ అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ‘వన్ హెల్త్ అప్రోచ్’ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నడ్డా చెప్పారు. 2022 జూలై నెలలో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ.. ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (PM-STIAC) ’వన్ హెల్త్ మిషన్’ని స్థాపించాలని సిఫార్సు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని ఆరోగ్య కార్యకలాపాలను ఏకీకృతం చేయడం దీని లక్ష్యం అని తెలిపారు. అంతేకాకుండా.. కొత్త, అభివృద్ధి చెందుతున్న వ్యాధులను ఎదుర్కోవటానికి నేషనల్ వన్ హెల్త్ మిషన్ (NOHM) ప్రధాన స్తంభం.. ఆధునిక సాంకేతికతతో కూడిన సమగ్ర నిఘా వ్యవస్థ అని నొక్కిచెప్పారు. సమీకృత నిఘా వ్యవస్థ సహాయంతో.. మానవులు, జంతువులు.. వన్యప్రాణులను పర్యవేక్షిస్తుందన్నారు. అంటువ్యాధులపై పరిశోధన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డిహెచ్ఆర్) ద్వారా ఎన్ఓహెచ్ఎంకు రూ.386.86 కోట్ల బడ్జెట్ను విడుదల చేసినట్లు నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!