JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
- నిపా వైరస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
- నిపా.. కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి- నడ్డా
- జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయి- జేపీ నడ్డా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిపా వైరస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
Read Also: Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
Also Read
- TATA Group: టాటా సన్స్కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
‘గత కొన్ని దశాబ్దాలుగా.. జంతువులతో సంపర్కం నుండి అనేక అంటువ్యాధుల ఉద్భవించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదించిందని నడ్డా తెలిపారు. దీంతో ఆరోగ్య రంగంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చాయని.. ఇది ప్రపంచ స్థాయిలో ఆందోళన కలిగించిందని చెప్పారు. 2011లో బంగ్లాదేశ్, భారత్లో నిపా వైరస్ వ్యాపించిందని అన్నారు. అంతే కాకుండా.. హాంకాంగ్లో 2002-03లో SARS (SARS), 2005లో H5N1, 2009లో H1N1, 2012లో MERS (MERS), 2014లో Zika వైరస్.. 2019లో COVID-19 వ్యాపించిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
Read Also: Lavanya Audio: లావణ్య -మస్తాన్ సాయిల ఆడియో లీక్.. అంతకు మించి అంటూ!
ఈ అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ‘వన్ హెల్త్ అప్రోచ్’ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నడ్డా చెప్పారు. 2022 జూలై నెలలో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ.. ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (PM-STIAC) ’వన్ హెల్త్ మిషన్’ని స్థాపించాలని సిఫార్సు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని ఆరోగ్య కార్యకలాపాలను ఏకీకృతం చేయడం దీని లక్ష్యం అని తెలిపారు. అంతేకాకుండా.. కొత్త, అభివృద్ధి చెందుతున్న వ్యాధులను ఎదుర్కోవటానికి నేషనల్ వన్ హెల్త్ మిషన్ (NOHM) ప్రధాన స్తంభం.. ఆధునిక సాంకేతికతతో కూడిన సమగ్ర నిఘా వ్యవస్థ అని నొక్కిచెప్పారు. సమీకృత నిఘా వ్యవస్థ సహాయంతో.. మానవులు, జంతువులు.. వన్యప్రాణులను పర్యవేక్షిస్తుందన్నారు. అంటువ్యాధులపై పరిశోధన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డిహెచ్ఆర్) ద్వారా ఎన్ఓహెచ్ఎంకు రూ.386.86 కోట్ల బడ్జెట్ను విడుదల చేసినట్లు నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్కు ఆర్బీఐ ఊహించని షాక్..
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!