MK Stalin: తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా, సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మధురైలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మధురైని మణిపూర్లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మధురైలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉన్న పోరు ఇప్పుడు టీవీకే రూపంలో స్టార్ యాక్టర్ విజయ్ రావడంతో ముక్కోణపు పోటీగా మారింది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోసారి, డీఎంకే అధికారంలోకి వస్తుందని ‘‘లోక్ పోల్’’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. గత కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పోరు నెలకొనగా, ఈ సారి మాత్రం విజయ్ రూపంలో టీవీకే బరిలో నిలించింది. ఇప్పటికే కూటముల మధ్య ఎన్నికల పొత్తులు, సీట్ల పంపణీ ఖరారైంది. ముఖ్యంగా, సీఎంగా అభ్యర్థులుగా ఉన్న ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), విజయ్ కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కొలత్తూర్ నుంచి స్టాలిన్: డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై…
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే, అధికార డీఎంకే కూటమిలో సీట్ల పంపిణీపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా, కీలక మిత్ర పక్షంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే విజయ్ పార్టీలో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పడింది.
O Panneerselvam: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. "నేను సంతోషంగా డీఎంకేలో చేరాను.. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో వస్తారు.. పళణి స్వామి ఎఐడీఎంకేను నాశనం చేస్తాడు.. పళణి స్వామి ఒక నియంత.. ఏఐడీఎంకేలో…
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్గా మారింది.
MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు.
వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు.. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడుతారు.. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని టీవీకే చీఫ్ పేర్కొన్నారు.