Mandipalli Ramprasad Reddy: రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు
- కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో జేసీ, కలెక్టర్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయాలి.. ఆ మీటింగ్ కు వీఆర్వోలు అందరిని పిలిపించాలి..
Also Read:Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు
Also Read
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
వీఆర్వోల వ్యవస్థ ఎలా తయారయ్యింది అంటే పల్లెల్లో ఎవరైతే మంచి కాఫీ తాపుతారో, నాటుకోడి చికెన్ పెడతారో వాళ్లకే పనులు జరుగుతున్నాయి.. మిగిలిన వారిని వీఆర్వోలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఆయన కూడా స్పందించారు.. త్వరలో అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు ఎమ్మెల్యేలు, టిడిపి ఇన్చార్జులు మీటింగ్ ఏర్పాటు చేస్తారు.. ఈ మీటింగ్ కు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ హాజరయ్యేలా చూడాలి.. చాలామంది రైతుల్లో నిరుత్సాహం ఉంది..
ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ కార్యక్రమాలు జరుగుతాయో జరగవో గానీ.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలన్నీ బయటపెట్టి రెవిన్యూ పరంగా మంచి చేస్తామని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడేందుకు రెవిన్యూ సిస్టం బాగా పనిచేయాలి.. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ల మనుగడ సాధించాలంటే రికార్డులన్నీ సక్రమంగా ఉండాలి.. ఆ రికార్డులన్నీ గత 5 సంవత్సరాల్లో తార్ మార్ చేశారు.. వీటన్నిటిని చక్కదిద్దేందుకు పై స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!