Mandipalli Ramprasad Reddy: రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు
- కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో జేసీ, కలెక్టర్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయాలి.. ఆ మీటింగ్ కు వీఆర్వోలు అందరిని పిలిపించాలి..
Also Read:Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు
Also Read
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
వీఆర్వోల వ్యవస్థ ఎలా తయారయ్యింది అంటే పల్లెల్లో ఎవరైతే మంచి కాఫీ తాపుతారో, నాటుకోడి చికెన్ పెడతారో వాళ్లకే పనులు జరుగుతున్నాయి.. మిగిలిన వారిని వీఆర్వోలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఆయన కూడా స్పందించారు.. త్వరలో అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు ఎమ్మెల్యేలు, టిడిపి ఇన్చార్జులు మీటింగ్ ఏర్పాటు చేస్తారు.. ఈ మీటింగ్ కు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ హాజరయ్యేలా చూడాలి.. చాలామంది రైతుల్లో నిరుత్సాహం ఉంది..
ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ కార్యక్రమాలు జరుగుతాయో జరగవో గానీ.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలన్నీ బయటపెట్టి రెవిన్యూ పరంగా మంచి చేస్తామని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడేందుకు రెవిన్యూ సిస్టం బాగా పనిచేయాలి.. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ల మనుగడ సాధించాలంటే రికార్డులన్నీ సక్రమంగా ఉండాలి.. ఆ రికార్డులన్నీ గత 5 సంవత్సరాల్లో తార్ మార్ చేశారు.. వీటన్నిటిని చక్కదిద్దేందుకు పై స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!