Jogi Ramesh: నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి నాకు పెనమలూరుతో సంబంధాలు.. జెండా ఎగరడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు వ్యవహారం హాట్ టాపిక్గా నడుస్తోంది.. ఇప్పటికే మూడు లిస్ట్లు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. నాల్గో జాబితా రెడీ చేస్తోంది.. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు.. ఇలా పలువరు నేతలు మరోస్థానానికి మారని పరిస్థితులు వచ్చాయి.. అయితే, కొన్ని చోట్ల పరిస్థితులు సాఫీగా ఉన్న మరికొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక, మంత్రి జోగి రమేష్ను పెనమలూరు నియోజకవర్గానికి ఇంఛార్జ్గా పెట్టింది వైసీపీ అధిష్టానం.. తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వకర్తగా తొలిసారి పెనమలూరులో అడుగుపెట్టారు జోగి రమేష్.. ఆయనకు ఘన స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు. ఉయ్యూరు వీరమ్మ తల్లి దర్శనంతో పెనమలూరు సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించారు.
Read Also: Mahant Raju Das: సిద్దరామయ్య పేరులో రాముడు ఉన్నాడు కానీ అతడి ప్రవర్థన కాలనేమిలా ఉంది..
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి పెనమలూరుతో నాకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.. వంగవీటి రంగా అనుచరుడిగా నేను ఇక్కడి వారికి పరిచయమే అన్నారు. ఇక, స్థానికత అనేది తనకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. నేనేమీ చిత్తూరులో పుట్టి మంగళగిరికి రాలేదు అంటూ నారా లోకేష్పై సెటైర్లు వేసిన ఆయన.. నేను ఈ జిల్లాలోనే పుట్టాను అన్నారు. నా అభిమానుల పేర్లతో వెలిసిన ఫ్లెక్సీలను పెద్దగా పట్టించుకోను.. రాజకీయాల్లో ఇవన్నీ సహజం అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించినా పల్లెత్తు మాట అనని వాళ్లకు.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అవసరమా..? అని నిలదీశారు. జగన్ను తిట్టారు.. జోగి రమేష్ను తిట్టలేదు కదా? అని సైలెంట్గా ఉంటే రాజకీయం ఎందుకు..? అని మండిపడ్డారు. అధినేతను విమర్శిస్తే నేనైతే ఊరుకోను అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!