Michaung Cyclone: ఏపీని తాకనున్న ‘మిచాంగ్’ తుపాన్.. మూడు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం ‘మిచాంగ్’ తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ ఒడిశాలోని చాలా ప్రాంతాలు, ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రానున్న 12 గంటలపాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర తమిళనాడు తీరాలకు ఐఎండీ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, మైచాంగ్ తుఫానును ఎదుర్కోవడానికి సన్నాహాలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని బిజెపి కార్యకర్తలను కూడా సహాయ చర్యలలో పాల్గొనాలని, స్థానిక పరిపాలనకు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు.
తుఫాను ప్రభావంతో ఒడిశాలో వర్షాలు మళ్లీ కురుస్తాయని, మరో రెండు రోజుల్లో దీని తీవ్రత పెరుగుతుందని భువనేశ్వర్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాంలలో డిసెంబర్ 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా, దక్షిణ జిల్లాల మేజిస్ట్రేట్లను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. భారీ వర్షాలు, తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) 54 రైళ్లను రద్దు చేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
Read Also:Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
5 అడుగుల మేర పెరగిన సముద్ర మట్టం
తుపాను కారణంగా తమిళనాడులోని మహాబలిపురం బీచ్లో సముద్ర మట్టం దాదాపు 5 అడుగుల మేర పెరిగింది. మత్స్యకారులు, పర్యాటకులు బీచ్లోకి వెళ్లకుండా నిషేధం విధించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం మీదుగా తూర్పు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మామల్లపురం, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంత ప్రజల దైనందిన జీవనం అతలాకుతలమైంది.
ఎన్సిఎంసి సన్నాహాలను సమీక్షించింది
మరోవైపు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో తుఫాను దృష్ట్యా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 21 బృందాలను మోహరించింది. ఇది కాకుండా మరో ఎనిమిది బృందాలను రిజర్వ్లో ఉంచారు. ఆదివారం క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతన నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ (ఎన్సిఎంసి) సమావేశమైంది. మిచాంగ్ తుపానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు.
Read Also:Bigg Boss 7 Telugu: పవన్ కళ్యాణ్ సినిమాలో పల్లవి ప్రశాంత్..?
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!