Michaung Cyclone: ఏపీని తాకనున్న ‘మిచాంగ్’ తుపాన్.. మూడు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం ‘మిచాంగ్’ తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ ఒడిశాలోని చాలా ప్రాంతాలు, ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రానున్న 12 గంటలపాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర తమిళనాడు తీరాలకు ఐఎండీ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, మైచాంగ్ తుఫానును ఎదుర్కోవడానికి సన్నాహాలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని బిజెపి కార్యకర్తలను కూడా సహాయ చర్యలలో పాల్గొనాలని, స్థానిక పరిపాలనకు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు.
తుఫాను ప్రభావంతో ఒడిశాలో వర్షాలు మళ్లీ కురుస్తాయని, మరో రెండు రోజుల్లో దీని తీవ్రత పెరుగుతుందని భువనేశ్వర్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాంలలో డిసెంబర్ 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా, దక్షిణ జిల్లాల మేజిస్ట్రేట్లను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. భారీ వర్షాలు, తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) 54 రైళ్లను రద్దు చేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Read Also:Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
5 అడుగుల మేర పెరగిన సముద్ర మట్టం
తుపాను కారణంగా తమిళనాడులోని మహాబలిపురం బీచ్లో సముద్ర మట్టం దాదాపు 5 అడుగుల మేర పెరిగింది. మత్స్యకారులు, పర్యాటకులు బీచ్లోకి వెళ్లకుండా నిషేధం విధించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం మీదుగా తూర్పు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మామల్లపురం, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంత ప్రజల దైనందిన జీవనం అతలాకుతలమైంది.
ఎన్సిఎంసి సన్నాహాలను సమీక్షించింది
మరోవైపు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో తుఫాను దృష్ట్యా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 21 బృందాలను మోహరించింది. ఇది కాకుండా మరో ఎనిమిది బృందాలను రిజర్వ్లో ఉంచారు. ఆదివారం క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతన నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ (ఎన్సిఎంసి) సమావేశమైంది. మిచాంగ్ తుపానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు.
Read Also:Bigg Boss 7 Telugu: పవన్ కళ్యాణ్ సినిమాలో పల్లవి ప్రశాంత్..?
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!