Honor Killing: మధ్యప్రదేశ్ లో పరువు హత్య.. ఇద్దరినీ చంపి నదిలో మొసళ్లకేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Killing: మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు. దీంతో ఇద్దరి మృతదేహాలను మొసళ్లు తినేశాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ప్రేమ జంట హత్య జరిగిన 15 రోజుల తర్వాత పోలీసులు వారిద్దరి మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రేమ వ్యవహారం కారణంగా పరువు హత్య కేసు మోరెనా జిల్లాలోని అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. 18 ఏళ్ల శివాని తోమర్ సమీపంలోని గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాధేశ్యామ్ తోమర్ (ఛోటు)తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం శివాని కుటుంబ సభ్యులకు తెలియడంతో రాధేశ్యామ్ను కలవడానికి నిరాకరించాడు. కానీ శివాని రాధేశ్యామ్ను కలవడం కొనసాగించింది. దీంతో కోపోద్రిక్తులైన శివాని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. దీంతో ప్రేమ జంట శివాని, రాధేశ్యామ్ తమ ఇల్లు, ఊరు వదిలి పారిపోయారు.
Read Also:Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈనెల 26 నుంచి రైతుబంధు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే కొద్ది రోజులకే ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలవడం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన శివాని కుటుంబ సభ్యులు ఓ రోజు తమ కుమార్తెను, రాధేశ్యామ్ను కాల్చి చంపారు. హత్య చేసిన తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు. ఈ హత్య ఘటన జూన్ 3న జరిగింది. శివాని తండ్రి తన కూతురు కనిపించడంలేదిన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
Read Also:RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
అనుమానం వచ్చిన పోలీసులు శివాని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. దీంతో మొత్తం కథ వెలుగులోకి వచ్చింది. కులం కారణంగా ఈ సంబంధాన్ని అంగీకరించలేదని బాలిక బంధువులు తెలిపారు. దీంతో ముందుగా కూతురు శివానిని మందలించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరినీ కాల్చి చంపాడు. మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసులు డైవర్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఛిద్రమైన స్థితిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి మృతదేహాలను మొసళ్లు తిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. హంతకులను అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!