Honor Killing: మధ్యప్రదేశ్ లో పరువు హత్య.. ఇద్దరినీ చంపి నదిలో మొసళ్లకేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Killing: మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు. దీంతో ఇద్దరి మృతదేహాలను మొసళ్లు తినేశాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ప్రేమ జంట హత్య జరిగిన 15 రోజుల తర్వాత పోలీసులు వారిద్దరి మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రేమ వ్యవహారం కారణంగా పరువు హత్య కేసు మోరెనా జిల్లాలోని అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. 18 ఏళ్ల శివాని తోమర్ సమీపంలోని గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాధేశ్యామ్ తోమర్ (ఛోటు)తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం శివాని కుటుంబ సభ్యులకు తెలియడంతో రాధేశ్యామ్ను కలవడానికి నిరాకరించాడు. కానీ శివాని రాధేశ్యామ్ను కలవడం కొనసాగించింది. దీంతో కోపోద్రిక్తులైన శివాని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. దీంతో ప్రేమ జంట శివాని, రాధేశ్యామ్ తమ ఇల్లు, ఊరు వదిలి పారిపోయారు.
Read Also:Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈనెల 26 నుంచి రైతుబంధు
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే కొద్ది రోజులకే ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలవడం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన శివాని కుటుంబ సభ్యులు ఓ రోజు తమ కుమార్తెను, రాధేశ్యామ్ను కాల్చి చంపారు. హత్య చేసిన తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు. ఈ హత్య ఘటన జూన్ 3న జరిగింది. శివాని తండ్రి తన కూతురు కనిపించడంలేదిన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
Read Also:RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
అనుమానం వచ్చిన పోలీసులు శివాని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. దీంతో మొత్తం కథ వెలుగులోకి వచ్చింది. కులం కారణంగా ఈ సంబంధాన్ని అంగీకరించలేదని బాలిక బంధువులు తెలిపారు. దీంతో ముందుగా కూతురు శివానిని మందలించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరినీ కాల్చి చంపాడు. మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసులు డైవర్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఛిద్రమైన స్థితిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి మృతదేహాలను మొసళ్లు తిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. హంతకులను అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!