Crime News : దారుణం.. మటన్ కూర వండలేదని భార్యను చంపిన భర్త
- చిన్నగా మొదలైన గొడవ
- క్షణికావేశంలో మర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : ఈ నడుమ చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వట్లేదని, అడిగిన వస్తువు కొనివ్వట్లేదని.. ఇలాంటి కారణాలకే చంపేస్తున్నారు. మొన్న కూరలో నల్లిబొక్క వేయలేదనే కారణంతో కూడా చంపిన ఘటన చూశాం. ఇప్పుడు తాజాగా ఓ భర్త చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మటన్ కూర వండలేదనే కారణంతో భార్యను కొట్టి చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సిరోల్ మండలం మంజా తండాకు చెందిన మాలోత్ బాలు, కళావతి(35) దంపతులు.
Read Also : Indians Trapped: పొట్ట కూటి కోసం వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో.. చివరికి ఇలా..!
Also Read
ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో భార్య మటన్ కూర వండలేదని బాలు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవ పెద్దది అయింది. ఆవేశం తట్టుకోలేక బాలు తన భార్యను దారుణంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఇదే విషయంపై కళావతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో గొడవ పడి కొట్టి చంపేశాడని ఆమె ఆరోపిస్తోంది. పోలీసులు బాలును అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..