Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలతో మంత్రి జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్లో సూరత్కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్లోని గ్రాండ్ భగవతీ హోటల్లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు అక్కడి విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో శివసేనలో చీలిక మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది.
మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు గెలుపొందారు. బీజేపీకి మొత్తం 134 ఓట్లు వచ్చినట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీకి అసెంబ్లీలో నలుగురిని గెలుచుకోగల సంఖ్యాబలం 106 కాగా.. 134 ఓట్లు వచ్చాయి. ఐదుగురిని బరిలోకి దించి పూర్తిస్థాయిలో విజయం సాధించింది. అంటే స్వతంత్రులతో పాటు అధికార పక్షం వారివీ ఉంటాయని భావిస్తున్నారు. కూటమిలోని మూడు పక్షాలు రెండేసి చొప్పున ఆరు స్థానాల్లో పోటీ చేసి ఐదుగురిని మాత్రమే గెలుపించుకోగలిగాయి.
ఏక్నాథ్ షిండే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా లేరని శివసేన నేత ఒకరు తెలిపారు. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీ నేత షిండే తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి షిండే వస్తారో రారో వేచి చూడాల్సిందే.
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
మరోవైపు మహారాష్ట్రలో 288 స్థానాలకు గానూ సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 113 సీట్లతో భాజపా రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరినా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోదు. మహా వికాస్ అఘాడీకి మెజార్టీ కంటే ఎక్కవ స్థానాలే ఉన్నాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భాజపాకు లాభం చేకూరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!