Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Krmb Meeting Ended Without A Resolution On Water Shares

KRMB Meeting: నీటి వాటాలపై తేల్చకుండానే ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం

Published Date :May 11, 2023 , 10:43 am
By Mahesh Jakki
KRMB Meeting: నీటి వాటాలపై తేల్చకుండానే ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

KRMB Meeting: కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. తాత్కాలిక సర్దుబాటు 66:34 తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించామని, 811 టీఎంసీల్లో చెరోసగం కేటాయించాల్సిందేనని తెలిపింది. పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని.. పట్టిసీమ గోదావరి జలాల మళ్లింపులో తమకెందుకు వాటా ఇవ్వరని ప్రశ్నించారు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలోని ఓ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డు బడ్జెట్‌పై చర్చ జరిగింది. గెజిట్‌ నోటిఫికేషన్‌, హిందీ అమలు, ఏపీకి కార్యాలయం తరలింపు, జల విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లెక్కింపు, ఆర్డీఎస్‌పై చర్చించారు అధికారులు. కేఆర్‌ఎంబీ కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎలాంటి నీటి వాటా ఖరారు చేయలేదని, 66:34 నిష్పత్తిలో నీటివాటా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు తెలిపారు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న వాదన సరికాదన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కంటే సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఏపీ అధికారులు.. కృష్ణా బోర్డును త్వరలో విశాఖకు తరలిస్తామని చెబుతున్నారు.

Also Read

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

Read Also: Minister Kakani Govardhan Reddy: పవన్‌కు 10 పంటలు చూపిస్తే 5 కూడా గుర్తుపట్టలేడు..

హైదరాబాద్‌ జలసౌధలో నిన్న సుదీర్ఘంగా జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు 17వ సమావేశం తీవ్ర వాదోపవాదాల మధ్య కొనసాగింది. బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్​సీ మురళీధర్, ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్​సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. 22 అంశాలున్న ఎజెండాపై జరిగిన ఈ సమావేశంలో అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటుండగా, వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది. దీనిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఛైర్మన్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చేవరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుంది. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • jalsoudha
  • Krishna Board
  • krishna river
  • krmb

తాజావార్తలు

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions