MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
- పులివెందుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ విఫలం
- జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
- ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని.. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు. వేంపల్లి పంచాయితీలో పని చేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారని, జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా? అని రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
వేంపల్లిలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ‘పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ విఫలం అయ్యారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. వేంపల్లిలో త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలి. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారు. వేంపల్లి పంచాయితీలో పనిచేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారు. జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా?. తాజాగా సస్పెండ్ అయిన ఈఓ నాగసుబ్బరెడ్డి కోటి 88 లక్షలు మింగేశాడు. ప్రజలు కట్టిన పన్నును తమ అకౌంట్లలో వేసుకొని ఆస్తులు పెంచుకున్నారు. ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశారు’ అని మండిపడ్డారు.
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
‘ఏడాదిగా గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించకుండా వ్యవస్థను నాశనం చేశారు. మూడు సమావేశాలకు హాజరుకకపోతే సర్పంచ్, వార్డు సభ్యులు సభ్యత్వం రద్దు అవ్వాలి. సర్పంచ్ రాజీనామా చేయకుండా.. కనీసం ప్రభుత్వ అనుమతులు లేకుండా వైస్ సర్పంచ్ గా శ్రీనివాసులు కొనసాగడం ఆశ్చర్యం. వారం లోగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. ఇప్పటికే NRGC ద్వారా సిమెంట్ రోడ్డు పనులు వేస్తున్నాం. వేంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. బస్టాండ్, తువ్వపల్లి బ్రిడ్జిలను త్వరలో ప్రారంభిస్తాం’ అని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!