Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Campaign At Secunderabad

Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట..

Published Date :March 23, 2024 , 3:41 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమైనాయన్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు 7ఫేస్ లలో జరుగుతున్నాయని, మన తెలంగాణలో 4వ ఫేస్ లో మే 13న ఎన్నికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసాకే టిఫిన్ చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పోలింగ్‌ రోజు ఉదయం లేవగానే ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో 40శాతం కూడా పోలింగ్ జరగడం లేదని, ప్రజలకు సౌకర్యాలు లేవని ప్రతీ ఒక్కరు విమర్శిస్తరు. ప్రతీ ఒక్కరికి విమర్శించడానికి ఎంత హక్కు ఉందో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు.

 

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

ఐదేండ్లకు ఒక్కసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు కుటుంబ సభ్యులతో చర్చించి వేయాలని, దేశం కోసం జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే దేశం భద్రంగా ఉంటదో, దేశ గౌరవం పెరుగుతుందో, మన పిల్లల భవిష్యత్తు బాగుంటదో ఆలోచించి వేయాలన్నారు. కాంగ్రెస్ హాయాంలో దేశంలో, హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ ఉగ్రవాదాలు తోకలు కోసాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచి వేసిందని, ఇది మోడీ భారతం, కొత్త భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పినమన్నారు.

ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపి ఆ దేశాల్లో చిక్కుకున్న 25వేల భారతీయులను స్వదేశానికి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా పని చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం కారణంగా 46వేల మంది చనిపోయిన జమ్మూ కాశ్మీర్ లో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిందని, యూపీఏ పాలనలతో దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దేశంలో నేడు తినడానికి తిండి దొరకడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఏకాకిని చేశారని, కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్న కనిమొళి, రాజా 2జీ స్పెక్ట్రంలో అవినీతి చేసి జైలు కు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో రూపాయి అవినీతి జరగలేదని, ధర్మబద్ధంగా, నీతి, నిజాయితీగా మోడీ పని చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో దేశం ఎలా ఉందో, మోడీ హయాంలో దేశం ఎలా ఉందో తేడా చూసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని కిషన్‌ రెడ్డి అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions