Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virendra Sachdeva: ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న బీజేపీ.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ రోడ్లపై తిరిగే ట్యాక్సీలు, బస్సుల్లో ప్యానిక్ బటన్ల ఏర్పాటు పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోట్లాది కుంభకోణానికి పాల్పడుతోందని వీరేంద్ర సచ్దేవ్ ఆరోపించారు.
Read Also: Delhi University: ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్లో ఓ విద్యార్థి హత్య.. కారణమదేనా..!
Also Read
- Trump: భారత్, చైనా టారిఫ్లపై వాణిజ్య మంత్రితో ట్రంప్ వాగ్వాదం.. ఏం జరిగిందంటే..!
- Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
- Axar Patel: 'సొంత ఇంటికి స్వాగతం'.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
- ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మనోళ్ల విశ్వరూపం..
మరోవైపు ఢిల్లీలోని పబ్లిక్ వాహనాల్లో అమర్చిన ప్యానిక్ బటన్లు పనిచేయడం లేదని చూపించేందుకు వీరేంద్ర సచ్దేవా ఆదివారం ఢిల్లీ రోడ్లపై ట్యాక్సీలో ప్రయాణించారు. రోడ్డుపై ఉన్న వాహనంలో పానిక్ బటన్ నొక్కినా ఎవరూ రాలేదన్నారు. మొత్తం వ్యవస్థలోనే ఎంత పెద్ద మోసం చేశారని సచ్ దేవ్ తెలిపారు. ప్యానిక్ బటన్ పేరుతో ఒక్కో వాహనం నుంచి 9 వేల రూపాయలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆ రుసుమును 17 వేలకు పెంచారని తెలిపారు. ఇది పానిక్ బటన్ కానప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని వీరేంద్ర సచ్దేవా డిమాండ్ చేశారు.
Read Also: Rakesh Master: నేను చనిపోతానని ముందే తెలుసు.. కన్నీరు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి మాటలు
బటన్ పనిచేయని వాహనాల నుంచి ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజు కూడా తీసుకుంటున్నారని వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజు పేరుతో 4800 రూపాయలు తీసుకుంటున్నారని, ఈ డబ్బు ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎన్ని పానిక్ బటన్లు నొక్కారో చూడాలని కేజ్రీవాల్కు వీరేంద్ర సచ్దేవా సవాల్ విసిరారు. వారికి సహాయం ఎక్కడ చేరింది? మరి దాని కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండంటూ ప్రశ్నించారు.
- Tags
- AAP
- bjp
- Delhi
- kejriwal
- naional news
తాజావార్తలు
-
Trump: భారత్, చైనా టారిఫ్లపై వాణిజ్య మంత్రితో ట్రంప్ వాగ్వాదం.. ఏం జరిగిందంటే..!
-
Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
-
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్
-
Elon Musk: పాపం ఎలాన్ మస్క్కు భారీ షాక్.. ఆ హోదాను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు!
-
Axar Patel: ‘సొంత ఇంటికి స్వాగతం’.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!