Gandhi Bhavan: పీసీసీ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ..
- గాంధీ భవన్లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ
- నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పై కమిటీ కి నివేదిక ఇచ్చిన కాటా
- బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు.
గాంధీ భవన్లో పీసీసీ కమిటీతో పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు పోస్టింగులు వేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని.. అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు. ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కాటా కమిటీ ముందు ఉంచారు. ఇటీవల జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోలను కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి ఇచ్చారు.
Read Also: USA: ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
అనంతరం.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి 72 వేల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. మిగిలిన నాలుగు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తావా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ బొమ్మ పెట్టాల్సిందే అంటున్నాడు బండి సంజయ్.. ఎందుకు పెట్టాలని అడిగారు. బలహీనవర్గాలకు ఆరు లక్షలు తాము ఇస్తే.. 72 వేలు కేంద్రం ఇవ్వాలి.. ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వనే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే.. 12 పైసలు ఇచ్చే మీరు.. మా పేరు పెట్టాల్సిందే అంటున్నాడని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇండ్లు లేని వాళ్లందరికీ మీరు ఇండ్లు కట్టించండి.. మీ పేరే పెట్టుకోండి.. తమకు అభ్యంతరం లేదని అన్నారు. బీజేపీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యం.. 54 లక్షల కార్డులకేనని తెలిపారు. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
తాజావార్తలు
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!