Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
- కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు- కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. సద్వినియోగం చేసుకోవాలి
- మూడు స్థానాలు గెలిచి తీరాలి- కిషన్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సీట్లు గెలిచిన సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయన్నారు. మూడు స్థానాలు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొందామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మండలి ఎన్నికల ద్వారా దాన్ని మనం రుజువు చేయాలి.. ఓటర్ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలి.. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అంబేద్కర్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తుంది.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. బేషరుతుగా కేంద్ర ఇచ్చే సంక్షేమ పథకాల మీద ప్రధాని బొమ్మ పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష్య పూరితంగా వ్యవహరించకుండా పెద్ద ఎత్తున, నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని కక్ష్య పూరితంగా విష ప్రచారం చేస్తున్నారు.. ఇచ్చిన వాగ్దానాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం హైడ్రా, మూసీ అంటూ హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పద్మ అవార్డుల మీద తప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రకరకాల వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!