Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
- కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు- కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. సద్వినియోగం చేసుకోవాలి
- మూడు స్థానాలు గెలిచి తీరాలి- కిషన్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సీట్లు గెలిచిన సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయన్నారు. మూడు స్థానాలు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొందామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మండలి ఎన్నికల ద్వారా దాన్ని మనం రుజువు చేయాలి.. ఓటర్ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలి.. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
Also Read
తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అంబేద్కర్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తుంది.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. బేషరుతుగా కేంద్ర ఇచ్చే సంక్షేమ పథకాల మీద ప్రధాని బొమ్మ పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష్య పూరితంగా వ్యవహరించకుండా పెద్ద ఎత్తున, నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని కక్ష్య పూరితంగా విష ప్రచారం చేస్తున్నారు.. ఇచ్చిన వాగ్దానాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం హైడ్రా, మూసీ అంటూ హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పద్మ అవార్డుల మీద తప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రకరకాల వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..