Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
- కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు- కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. సద్వినియోగం చేసుకోవాలి
- మూడు స్థానాలు గెలిచి తీరాలి- కిషన్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సీట్లు గెలిచిన సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయన్నారు. మూడు స్థానాలు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొందామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మండలి ఎన్నికల ద్వారా దాన్ని మనం రుజువు చేయాలి.. ఓటర్ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలి.. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
Also Read
తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అంబేద్కర్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తుంది.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. బేషరుతుగా కేంద్ర ఇచ్చే సంక్షేమ పథకాల మీద ప్రధాని బొమ్మ పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష్య పూరితంగా వ్యవహరించకుండా పెద్ద ఎత్తున, నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని కక్ష్య పూరితంగా విష ప్రచారం చేస్తున్నారు.. ఇచ్చిన వాగ్దానాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం హైడ్రా, మూసీ అంటూ హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పద్మ అవార్డుల మీద తప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రకరకాల వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!