PM Narendra Modi: కర్ణాటక ‘డబుల్ ఇంజిన్’ ఇతర దేశాలకు సవాల్ విసురుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: కర్ణాటకను కీలక పెట్టుబడి గమ్యస్థానంగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అనేక రంగాలలో రాష్ట్రంలో వేగవంతమైన వృద్ధికి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ శక్తే ఒక కారణమని అన్నారు. మూడు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, ‘ఇన్వెస్ట్ కర్ణాటక 2022’లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తూ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం గురించి నొక్కిచెప్పడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో దాదాపు 500 ఫార్చూన్ కంపెనీలు ఉన్నాయని, దేశంలోని 100కు పైగా యూనికార్న్లలో 40కి పైగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ క్లస్టర్లలో కర్ణాటక ఒకటిగా పేరుగాంచిందన్నారు. పరిశ్రమల నుంచి ఐటీ వరకు, ఫిన్-టెక్ నుంచి బయోటెక్ వరకు, స్టార్టప్ నుంచి స్థిరమైన శక్తి వరకు పురోగతిలో కొత్త రికార్డులు సృష్టిస్తు్న్నాయన్నారు. కర్నాటక భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, కొన్ని దేశాలకు కూడా సవాలు విసురుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రతిభ, సాంకేతికత గురించి మాట్లాడినప్పుడల్లా, మనస్సులో మొదట కనిపించే పేరు ‘బ్రాండ్ బెంగళూరు’ అని ఆయన అన్నారు. కొవిడ్ తర్వాత దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను కలుసుకోవడం ఇదే తొలిసారి.
Also Read
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
Honey Trap: బీజేపీ ఎమ్మెల్యేకు వలపు వల.. వాట్సాప్లో నగ్నంగా వీడియో కాల్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను స్వాగతించిన ప్రధాని మోదీ.. కర్ణాటక సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశమని కొనియాడారు. ప్రకృతి, సంస్కృతుల గొప్ప సమ్మేళనమన్నారు. కర్ణాటక అత్యంత అందమైన సహజమైన హాట్స్పాట్లకు ప్రసిద్ధి చెందిందన్నారు. మృదు భాష కన్నడ, ఇక్కడి గొప్ప సంస్కృతి, కన్నడిగులలో అందరి పట్ల ఉన్న అభిమానం అందరి హృదయాలను గెలుచుకుందని ఆయన అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ పోటీ, సహకార సమాఖ్యవాదానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
-
Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
-
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
-
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..