Breaking News : మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- కేసీఆర్తో హరీష్రావు, ఈటల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్
- 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురు నేతల వాంగ్మూలాలు నమోదు చేయడానికి కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే, వారికి సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
MR. Srinivasan: తుది శ్వాస విడిచిన మాజీ అణుశాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యతలేని పనులు చేపట్టారని, అంచనాలను పెంచి అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ విచారణలో భాగంగా, కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను, ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలిస్తోంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేయడం ఈ విచారణలో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
Viral : కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయాలంటే..? ఈ వీడియో తప్పనిసరిగా చూడండి..!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!