Breaking News : మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- కేసీఆర్తో హరీష్రావు, ఈటల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్
- 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురు నేతల వాంగ్మూలాలు నమోదు చేయడానికి కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే, వారికి సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
MR. Srinivasan: తుది శ్వాస విడిచిన మాజీ అణుశాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యతలేని పనులు చేపట్టారని, అంచనాలను పెంచి అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ విచారణలో భాగంగా, కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను, ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలిస్తోంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేయడం ఈ విచారణలో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
Viral : కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయాలంటే..? ఈ వీడియో తప్పనిసరిగా చూడండి..!
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!