Breaking News : మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
- కేసీఆర్తో హరీష్రావు, ఈటల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్
- 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురు నేతల వాంగ్మూలాలు నమోదు చేయడానికి కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే, వారికి సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాల్లో వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
MR. Srinivasan: తుది శ్వాస విడిచిన మాజీ అణుశాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యతలేని పనులు చేపట్టారని, అంచనాలను పెంచి అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ విచారణలో భాగంగా, కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను, ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలిస్తోంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేయడం ఈ విచారణలో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
Viral : కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయాలంటే..? ఈ వీడియో తప్పనిసరిగా చూడండి..!
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!