Kakani Govardhan: కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
- రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది- కాకాణి
- డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోంది- కాకాణి
- గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు- కాకాణి
- రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని పేర్కొన్నారు. అనధికారంగా 150 మంది రైతులు ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Read Also: Parents Sell Baby: బైక్ కొనేందుకు.. 9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయి.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని కాకాణి ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చనిపోయిన రైతు కుటుంబాలకు జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు ఒక కాపీ క్యాట్ లాంటివారు.. రుణమాఫీ పేరుతో అప్పుడు రైతులను మోసం చేసారు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి వారిని కూడా మోసం చేస్తున్నారని అన్నారు.
Read Also: Goa Liquor: గోవా నుంచి మద్యం తెస్తున్నారా? ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారో చూడండి..
రైతు భరోసా కేంద్రాలను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఆందోళన చేస్తున్న రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాబుది.. రాజధాని నిర్మాణం మీద ఉన్న శ్రద్ద.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబుకి లేదని విమర్శించారు. తనకు వాట్సప్లో హాయ్ పెడితే రైతుల నుంచి ధాన్యం కొంటానని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.. ఆయనకు ఎన్ని మెసేజ్లు పెట్టినా స్పందన లేదని వ్యాఖ్యానించారు. రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకుంటున్నారని కాకాణి తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చంద్రబాబు ప్రతి సభలోనూ చెప్పారు.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతున్నారని కాకాణి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..