Kadiyam Srihari : కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరని హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలో పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నిక వేళ …..అదే మోసం పునరావృతం చేయబోతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని,
గ్యాస్ సిలిండర్ లు కూడా అనేక నిబంధనలతో …..అర్హులను తగ్గించిందన్నారు. గృహ జ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని …..అక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ….ఉద్యోగ నియామకాలకు …..పరీక్షలు నిర్వహించిందన్నారు. ఎన్నికల నియావళి అమల్లోకి రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిచ్చమని నిస్సిగ్గుగా చెప్పుకుంటుందన్నారు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచుతుంది. ఇప్పటికి కూడా రైతుబందు అందరికీ రాలేదు. 2 లక్షల రుణమాఫీపైన కూడా స్పష్టత ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి భారాస ను భూచిగా చూపించి. ఆ మంత్రులను హెచ్చరిక చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. ప్రజల దృష్టిని మరల్చాడానికి ప్రయత్నం చేస్తోంది. వేసవి కాలంలో వచ్చే సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు కడియం శ్రీహరి.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతన్న ను ఆదుకోవడంలో మంత్రులు అధికారులు ఎవరు అందుబాటులో లేరని, సాగునీరు, తాగు నీరు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఓడిన గెలిచిన ప్రజల పక్షాన ఉంటామని, గత పది ఏళ్లలో రైతులు ఆనందం చూసారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఉన్న భూములను మెంట గా మార్చుతున్నారని, ఒక్కపుడు భారతదేశానికి అన్నం పెట్టిన తెలంగాణ రాష్టం ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు గంగుల కమలాకర్. రైతు భరోసా,రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అందలేదని, బి ఆర్ ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రజలకు పది సంవత్సరాల తేడా కనిపిస్తోందని, కేసీఆర్ విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!