KA Paul: జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించా.. కీలక బాధ్యతలు ఇస్తా..!
KA Paul: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారుండరు.. ఆఫీసర్గానే కాదు.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.. అయితే, మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఈ సారి ఏ పార్టీ అనేది ఇప్పటి వరకు తేలలేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూను తీసుకుని ఫైట్ చేస్తున్నారు.. అయితే, జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించినట్టు ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మట్లాడిన ఆయన.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించా.. పార్టీలో చేరితే కీలక పదవి భాద్యతలు అప్పగిస్తాను అని ప్రకటించారు.. అంతే కాదు.. జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీలో చేరతారని ఆశిస్తున్నానన్నారు.. అంతే కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని వ్యాఖ్యానించారు కేఏ పాల్..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశమిస్తే వారి ఇంటికి వెళ్లి కలుస్తానన్నారు కేఏ పాల్.. ఇక, హైదరాబాద్ లో వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్. విజయమ్మలు పోలీసులపై దాడి చేయడం అమానుషంగా పేర్కొన్నారు.. ప్రజాస్వామ్యంలో పోరాడాలి తప్ప పోలీసులపై దాడి చేయకూడదని హితవుపలికారు కేఏ పాల్. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ మధ్యే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కేఏ పాల్తో సమావేశమైన విషయం విదితమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతానని పాల్ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని… తనను అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు. అయితే, జేడీ లక్ష్మీనారాయణ విషయంలో పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి.
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!