Jagadish Reddy : బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్అయ్యారు. ఈ.డీ, ఐ.టీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Delhi Liquor Scam Case: సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్..! మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Also Read
బీజేపీ నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్నారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో వున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమన్నారు.
Also Read : Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని మంత్రి జగదీష్ హెచ్చరించారు. అణచివేతల ద్వారా చరిత్రలో ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో పాటు పలువురికి సంబంధం ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇప్పటికే మద్యం స్కాంలో కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా సిసోడియా అరెస్ట్ తర్వాత సీబీఐ, ఈడీ మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!