Raghunandan Rao: పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో వారందరూ పోటీ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచిందని రఘునందన్ తెలిపారు. సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటారని ఆరోపించారు.
Read Also: Mars: అంగారకుడి భూమధ్య రేఖ కింద “వాటర్ ఐస్”
Also Read
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరు.. కానీ, కోళ్లు అమ్ముకునేటోల్లకు.. మందు గోలీలు తయారు చేసేటోల్లకు.. బస్సులు నడిపేటోల్లకు టికెట్.. ఇచ్చింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు.. ప్రధాని మోడీ ముందు ముఖం చెల్లక అప్పటి సీఎం కేసీఆర్ కలువలేదని మండిపడ్డారు. కాగా.. బీఆర్ఎస్ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్టేనని తెలిపారు. త్వరలో పులి బయటకు వస్తాడని కేటీఆర్ అన్నారు.. బయటకు వచ్చేది పులి కాదు, కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అది అని విమర్శించారు.
Read Also: Sania Mirza Father: సానియా మీర్జా మాలిక్కు ఖులా ఇచ్చింది..
కాగా.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్ట్ లు అప్పగించడంతో నష్టం జరుగుతుందని హరీష్ రావు అంటున్నారు.. 2016లో కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకున్నారని రఘునందన్ తెలిపారు. 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!