Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!
- తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం
- క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- కాంగ్రెస్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నేడు తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ‘కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 14 నెలలు గడిచినా ఇంకా అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో మాట్లాడుతూ చరిత్రాత్మక కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక కార్యక్రమమా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చాము కానీ వీరి లాగా ప్రచారం చేసుకోలేదు’ అని అన్నారు.
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
Also Read: Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య!
‘డిక్లరేషన్లు ఇచ్చి, బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు ఇచ్చి..ఇంటి ఇంటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ఇలా 420 అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుంది. మహాత్మాగాంధీ వర్ధంతి రోజు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి ఈ ప్రభుత్వం గురించి చెబుదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలని పిలుపు ఇస్తున్నాను. ఈ 420 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి