Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!
- తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం
- క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- కాంగ్రెస్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నేడు తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ‘కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 14 నెలలు గడిచినా ఇంకా అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో మాట్లాడుతూ చరిత్రాత్మక కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక కార్యక్రమమా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చాము కానీ వీరి లాగా ప్రచారం చేసుకోలేదు’ అని అన్నారు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Also Read: Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య!
‘డిక్లరేషన్లు ఇచ్చి, బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు ఇచ్చి..ఇంటి ఇంటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ఇలా 420 అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుంది. మహాత్మాగాంధీ వర్ధంతి రోజు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి ఈ ప్రభుత్వం గురించి చెబుదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలని పిలుపు ఇస్తున్నాను. ఈ 420 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!