Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- హైటెక్ సిటీ, మాదాపూర్, మైండ్స్పేస్లో స్తంభించిన ట్రాఫిక్
- దుర్గం చెరువు బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- రంగంలోకి దిగిన HYDRAA.. అయినా తగ్గని ట్రాఫిక్ కష్టాలు
- జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంపై ప్రజల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువులను తలపించిన ఐటీ రోడ్లు
నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా సెంటర్, మాదాపూర్ ప్రాంతాలు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఏ చెరువునో, కుంటనో తలపించాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్లోబల్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకునే ఐటీ కారిడార్లోని డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ వర్షం మరోసారి బయటపెట్టింది. వరద నీరు కొండల్లా పేరుకుపోవడంతో, ఐటీ ఉద్యోగులు ఆకలితో, అలసటతో రోడ్లపైనే మూడు గంటలకు పైగా బందీలయ్యారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
కేబుల్ బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరోవైపు, నగరంలోనే అత్యంత కీలకమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వందలాది కార్లు, బైకులు చీమల కంటే దారుణంగా అంగుళం కూడా కదల్లేని స్థితిలో నిలిచిపోయాయి. అక్కడక్కడా కొద్దిమంది కింది స్థాయి పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడానికి, ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి చిత్తశుద్ధితో శ్రమించారు. కానీ, వరద ఉధృతి ముందు వారి ప్రయత్నాలు సరిపోలేదు.
అధికారుల సమన్వయ లోపంపై జనం ఆగ్రహం
ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో అసలు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్’ ఉందా లేదా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద అత్యవసర సమయంలో గ్రేటర్ (GHMC) మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థల మధ్య కనీస కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అధికారుల ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే తాము నడిరోడ్డుపై నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండి, ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ఇలాంటి సమయంలో ఏసీ గదులకే పరిమితం కావడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!