IPL 2025 Mega Auction: నెస్ వాడియాతో షారుఖ్ ఖాన్ వాగ్వాదం.. కావ్య మారన్ మద్దతు!
- మెగా వేలంకు సంబంధించి ముంబైలో సమావేశం
- మరోసారి భేటీ జరిగే అవకాశం
- వేలంను వ్యతిరేకించిన షారుఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Maran Suppots Shah Rukh Khan in IPL 2025 Auction Meeting: 2025 మెగా వేలంకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి, పది ఫ్రాంచైజీల యజమానుల మధ్య ముంబైలో సమావేశం జరిగింది. బుధవారం రాత్రి వరకూ జరిగిన ఈ భేటీలో మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్ పాలసీ, ఇంపాక్ట్ రూల్పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలక మండలి, ఫ్రాంచైజీల యజమానుల మధ్య వాడివేడిగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈ భేటీని ముగించింది. మరోసారి భేటీ జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుఖ్ ఖాన్ మెగా వేలంను వ్యతిరేకించినట్లు ఐపీఎల్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. షారుఖ్కు ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మారన్ మద్దతు పలికినట్లు సమాచారం. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ సహా యజమాని నెస్ వాడియా, షారుఖ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. షారుఖ్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. నెస్ మాత్రం అవసరం లేదని వాదించినట్లు సమాచారం. తప్పనిసరిగా మెగా వేలం నిర్వహించాలని పంజాబ్ ఓనర్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
Also Read: SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ
కనీసం 8 మందిని (నలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం లేదా ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎమ్ ద్వారా) రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మారన్ కోరినట్లు తెలుస్తోంది. విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకొనే అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారట. గాయంతో కాకుండా ఇతర కారణాలతో వైదొలిగే విదేశీ ఆటగాళ్లను టోర్నీ నుంచి నిషేధించాలిని బీసీసీఐకి కావ్య చెప్పారట. ఈ సమావేశంకు షారుఖ్ ఖాన్ (కోల్కతా), కిరణ్ కుమార్ గ్రంథి (ఢిల్లీ), సంజీవ్ గోయెంకా (లక్నో), నెస్ వాడియా (పంజాబ్), రూపా గురునాథ్ (చెన్నై), కావ్యా మారన్ (హైదరాబాద్), మనోజ్ బదాలే (రాజస్థాన్) తదితరులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!