BJP vs Congress: బీజేపీ రూ. 100 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది: కాంగ్రెస్ ఆరోపణ
BJP vs Congress: పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది. గత పదేళ్ల నుంచి దేశంలో అధికారంలో ఉన్న మీరు..100 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశారని హస్తం పార్టీ ఆరోపణలు చేసింది. దేశ ప్రజల నుంచి టాక్స్ లు, జీఎస్టీల ద్వారా వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయల.. డబ్బులన్నీ ఏం చేశారని? ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండని అని కాంగ్రెస్ పార్టీ సైతం ట్విట్టర్ వేదికగా నిలదీసింది. మీ కార్పొరేట్ మిత్రులకు సుమారు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారుగా.. మీ కార్పొరేట్ మిత్రులకేమో టాక్స్ లు తగ్గించేశారు.. సామాన్య ప్రజలకు టాక్స్ లు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనె వంటిపై అధిక రెట్లు వేశారంటూ విమర్శించింది. పేద ప్రజలు ఇచ్చే సబ్సిడీ కూడా ఎత్తేశారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అలాగే, డాలర్తో పోలిస్తే రూపాయి విలువను చాలా బలహీనంగా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించి, వ్యవసాయంపై పెట్టుబడిని రెండింతలు చేశారు.. రైతులను అప్పులు డబుల్ చేశారు.. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కు అమ్ముకుంటున్నారు.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారంటూ? హస్తం పార్టీ క్వశ్చన్ చేసింది. 5 నెలల కాంగ్రెస్ పాలనలో 5 గ్యారంటీలను అమలు చేసింది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం చేశాం.. 5 నెలల పాలనపై అంత విషం కక్కుతున్న ఈ బీజేపీ.. 120 నెలలు ఈ దేశాన్ని పాలించి 2014, 2019 లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!