BJP vs Congress: బీజేపీ రూ. 100 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది: కాంగ్రెస్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP vs Congress: పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది. గత పదేళ్ల నుంచి దేశంలో అధికారంలో ఉన్న మీరు..100 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశారని హస్తం పార్టీ ఆరోపణలు చేసింది. దేశ ప్రజల నుంచి టాక్స్ లు, జీఎస్టీల ద్వారా వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయల.. డబ్బులన్నీ ఏం చేశారని? ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండని అని కాంగ్రెస్ పార్టీ సైతం ట్విట్టర్ వేదికగా నిలదీసింది. మీ కార్పొరేట్ మిత్రులకు సుమారు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారుగా.. మీ కార్పొరేట్ మిత్రులకేమో టాక్స్ లు తగ్గించేశారు.. సామాన్య ప్రజలకు టాక్స్ లు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనె వంటిపై అధిక రెట్లు వేశారంటూ విమర్శించింది. పేద ప్రజలు ఇచ్చే సబ్సిడీ కూడా ఎత్తేశారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అలాగే, డాలర్తో పోలిస్తే రూపాయి విలువను చాలా బలహీనంగా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించి, వ్యవసాయంపై పెట్టుబడిని రెండింతలు చేశారు.. రైతులను అప్పులు డబుల్ చేశారు.. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కు అమ్ముకుంటున్నారు.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారంటూ? హస్తం పార్టీ క్వశ్చన్ చేసింది. 5 నెలల కాంగ్రెస్ పాలనలో 5 గ్యారంటీలను అమలు చేసింది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం చేశాం.. 5 నెలల పాలనపై అంత విషం కక్కుతున్న ఈ బీజేపీ.. 120 నెలలు ఈ దేశాన్ని పాలించి 2014, 2019 లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!