Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా 8,80,453, పురుషుల 844843 ఓటర్లు ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నేడు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేయనున్నారు.
READ MORE: Odisha: ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోడీ సవాల్.. సీఎం పట్నాయక్ రియాక్షన్..!
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
నల్లగొండ పార్లమెంట్ లో మొత్తం 2061 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 2061 టీం లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 5150 బ్యాలెట్ యూనిట్లు, 2575 కంట్రోల్ యూనిట్లు, 2883 వి వి ప్యాట్ లు పంపిణీ చేయనున్నారు. డీసీఆర్ ల నుంచి సిబ్బంది తరలింపునకు 1925 వాహనాలను సిద్ధ చేశారు. 2435 బృంధాలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి. మరో 374 టీంలు రిజర్వు ఫోర్స్ అందుబాటులో ఉంటాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఏడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల ఏర్పాటు. ఈవీఎం వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎన్నికల నిర్వహణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, (600)ఏడు కంపెనీల కేంద్రబలగాలు రంగంలోకి దిగాయి. భువనగిరి నియోజక వర్గ పరిధి లో మొత్తం 18,08,585 ఓట్లు ఉండగా అందులో మహిళలు 8,98,416 పురుషులు 9,10,090, ఇతరులు 79 ఉన్నారు. 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 8023 బ్యాలెట్ యూనిట్లు ఉండగా.. కంట్రోల్ యూనిట్స్ 2673, వివి ప్యాట్స్ 2994 ఉన్నాయి. 10,140 మంది అభ్యర్థులు పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యల తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పలువురి బైండోవర్ చేశారు. వేసవి కావడంతో కేంద్రాల వద్ద ఓటర్లకు పలు రకాల వసతులు ఏర్పాటు చేశారు. నీడ, నీరు ప్రధానంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!