Rajnath Singh: పాక్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పాకిస్థాన్ పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘పాకిస్థాన్ అసమర్థంగా భావిస్తే, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని రక్షణ మంత్రి చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలం గురించి కూడా మాట్లాడారు. తన తల్లి మరణించిన సమయంలో తనకు పెరోల్ కూడా ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నేత గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాకు పెరోల్ ఇవ్వలేదని, ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) మమ్మల్ని నియంతలుగా పిలుస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Haryana: హర్యానాలో ఘరో ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
సరిహద్దు దాటి పారిపోయే ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ దేశంలోకి ప్రవేశించేందుకు వెనుకాడబోదని రాజ్నాథ్ సింగ్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న కొద్దిరోజుల తర్వాత పాకిస్థాన్పై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో 2020 నుండి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో “లక్ష్యంగా హత్యలు” చేసిందని పేర్కొన్న ది గార్డియన్లో వచ్చిన నివేదికపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు వచ్చాయి. భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే.. ‘ఘుస్కే మారేంగే (మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తాం)’ అని రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. “భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు లేదా ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే ఎవరైనా భారతదేశానికి లేదా దాని శాంతికి బెదిరింపులకు పాల్పడితే, వారిని విడిచిపెట్టం” అని ఆయన అన్నారు.
రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. వాటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని పేర్కొంది. పాకిస్థాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర చూస్తే తెలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!