Rajnath Singh: పాక్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పాకిస్థాన్ పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘పాకిస్థాన్ అసమర్థంగా భావిస్తే, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని రక్షణ మంత్రి చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలం గురించి కూడా మాట్లాడారు. తన తల్లి మరణించిన సమయంలో తనకు పెరోల్ కూడా ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నేత గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాకు పెరోల్ ఇవ్వలేదని, ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) మమ్మల్ని నియంతలుగా పిలుస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Haryana: హర్యానాలో ఘరో ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
సరిహద్దు దాటి పారిపోయే ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ దేశంలోకి ప్రవేశించేందుకు వెనుకాడబోదని రాజ్నాథ్ సింగ్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న కొద్దిరోజుల తర్వాత పాకిస్థాన్పై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో 2020 నుండి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో “లక్ష్యంగా హత్యలు” చేసిందని పేర్కొన్న ది గార్డియన్లో వచ్చిన నివేదికపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు వచ్చాయి. భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే.. ‘ఘుస్కే మారేంగే (మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తాం)’ అని రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. “భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు లేదా ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే ఎవరైనా భారతదేశానికి లేదా దాని శాంతికి బెదిరింపులకు పాల్పడితే, వారిని విడిచిపెట్టం” అని ఆయన అన్నారు.
రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. వాటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని పేర్కొంది. పాకిస్థాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర చూస్తే తెలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!