Rajnath Singh: పాక్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పాకిస్థాన్ పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘పాకిస్థాన్ అసమర్థంగా భావిస్తే, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని రక్షణ మంత్రి చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలం గురించి కూడా మాట్లాడారు. తన తల్లి మరణించిన సమయంలో తనకు పెరోల్ కూడా ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నేత గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాకు పెరోల్ ఇవ్వలేదని, ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) మమ్మల్ని నియంతలుగా పిలుస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Haryana: హర్యానాలో ఘరో ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
Also Read
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
సరిహద్దు దాటి పారిపోయే ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ దేశంలోకి ప్రవేశించేందుకు వెనుకాడబోదని రాజ్నాథ్ సింగ్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న కొద్దిరోజుల తర్వాత పాకిస్థాన్పై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో 2020 నుండి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో “లక్ష్యంగా హత్యలు” చేసిందని పేర్కొన్న ది గార్డియన్లో వచ్చిన నివేదికపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు వచ్చాయి. భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే.. ‘ఘుస్కే మారేంగే (మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తాం)’ అని రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. “భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు లేదా ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే ఎవరైనా భారతదేశానికి లేదా దాని శాంతికి బెదిరింపులకు పాల్పడితే, వారిని విడిచిపెట్టం” అని ఆయన అన్నారు.
రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. వాటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని పేర్కొంది. పాకిస్థాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర చూస్తే తెలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల ఏం జట్టుకు ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!