Rajnath Singh: పాక్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పాకిస్థాన్ పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘పాకిస్థాన్ అసమర్థంగా భావిస్తే, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని రక్షణ మంత్రి చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలం గురించి కూడా మాట్లాడారు. తన తల్లి మరణించిన సమయంలో తనకు పెరోల్ కూడా ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నేత గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాకు పెరోల్ ఇవ్వలేదని, ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) మమ్మల్ని నియంతలుగా పిలుస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Haryana: హర్యానాలో ఘరో ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
సరిహద్దు దాటి పారిపోయే ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ దేశంలోకి ప్రవేశించేందుకు వెనుకాడబోదని రాజ్నాథ్ సింగ్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న కొద్దిరోజుల తర్వాత పాకిస్థాన్పై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో 2020 నుండి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో “లక్ష్యంగా హత్యలు” చేసిందని పేర్కొన్న ది గార్డియన్లో వచ్చిన నివేదికపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు వచ్చాయి. భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే.. ‘ఘుస్కే మారేంగే (మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తాం)’ అని రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. “భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు లేదా ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే ఎవరైనా భారతదేశానికి లేదా దాని శాంతికి బెదిరింపులకు పాల్పడితే, వారిని విడిచిపెట్టం” అని ఆయన అన్నారు.
రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. వాటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని పేర్కొంది. పాకిస్థాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర చూస్తే తెలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!