IND vs WI 2nd Test: భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India won Test series with 1-0 vs West Indies: వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టులో చివరి రోజైన సోమవారం పూర్తిగా ఆటను వర్షం తుడిచిపెట్టేయడంతో.. భారత్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో సిరీస్ 1-0తో టీమిండియా సొంతమైంది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్ సొంతమైనా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ కీలక పాయింట్లు కోల్పోయింది.
నాలుగో రోజు వర్షం అంతరాయంతో దాదాపు ఒక సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. చివరి రోజు అయినా వరుణుడు కరుణిస్తాడనుకుంటే.. అది జరగలేదు. వర్షం వస్తూ పోతూ ఉండటంతో.. ఆటగాళ్లు అసలు మైదానంలోకి కూడా రాలేకపోయారు. భారీ వర్షం కారంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో.. చివరికి అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగోరోజు 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి 76/2తో నిలిచింది. విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు కావాల్సి ఉంది. త్యాగ్నారాయణ్ (24 నాటౌట్), జెర్మైన్ బ్లాక్వుడ్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ సిరీస్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ జోరు చూస్తే సోమవారం కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యపడినా.. విండీస్ను ఆలౌట్ చేసేవారు. కానీ వరణుడు భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. 181/2 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ 76/2తో నిలిచింది. తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లోని తొలి మ్యాచ్ జూన్ 27న జరుగుతుంది.
Also Read: Cyber Fraud: చైనాలో కూర్చొని కూర్చుని స్కెచ్ వేస్తే.. 15000 మంది 712కోట్లు మోసపోయారు
https://twitter.com/12th_khiladi/status/1683554428601892865?s=20
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!