Shashi Tharoor: శశి థరూర్ యూటర్న్.. రాహూల్ గాంధీపై పొగడ్తల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చెక్ పెట్టారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కలిసిన మరుసటి రోజే థరూర్ ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శశిథరూర్ కొన్ని నెలలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోడీపై సానుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. సడెన్గా ఆయన ప్రవర్తన మాడంతో కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ఊహాగాను వచ్చాయి. ఎన్నో నెలలుగా ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నప్పటికీ వీటిపై స్పందించలేదు. తాజాగా ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం స్పందించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన థరూర్.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుపుకోసం తాను ముందుండి పనిచేస్తానని చెప్పారు. కేరళ ప్రచారంలో చురుకుగా పాల్గొంటానని, కాంగ్రెస్కు బలంగా నిలుస్తానని తెలిపారు. తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలకు ఎలాంటి ఆధారం లేదని తేల్చిచెప్పారు.
READ MORE: Salman Ali Agha: ప్రపంచ కప్లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..
Also Read
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్కు స్పష్టమైన రాజకీయ ఆలోచన ఉందని, సాంప్రదాయ విభజనకు వ్యతిరేకంగా నిలబడే నాయకుడని అన్నారు. తన దృష్టి అంతర్గత రాజకీయాలపై కాదని, దేశానికి సంబంధించిన అంశాలపైనేనని స్పష్టం చేశారు. 2009 నుంచి తాను ఇదే తరహా వైఖరిని కనబరుస్తున్నానని, పార్టీ అధికారిక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. తన విధేయతపై పదే పదే ప్రశ్నలు రావడంపై థరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉంటానని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి సందేహాలు తనకే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని, అయినా తాను కాంగ్రెస్తోనే గట్టిగా నిలబడతానని చెప్పారు. ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన భేటీ గురించి థరూర్ వివరించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశం గంట నలభై ఐదు నిమిషాల పాటు సాగిందని తెలిపారు. ఈ సమావేశంలో తన ఆవేదనలను నాయకుల దృష్టికి తీసుకెళ్లానని, చర్చ చాలా సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని అన్నారు. ఇప్పుడు అందరం ఒకే దారిలో కలిసి ముందుకు సాగుతున్నామని, ఇక చెప్పడానికి ఏమి మిగలలేదని వ్యాఖ్యానించారు.
READ MORE: Greatest T20 Cricketer: ఏకంగా ఏడు సార్లు.. విరాట్ కోహ్లీ ఆధిపత్యం మాములుగా లేదుగా!
తాజావార్తలు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!