Child Digital Addict: మితిమీరిన స్క్రీన్ టైం.. పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం! సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Digital Addict: నేటి ఆధునిక కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకు బానిసలవ్వడం ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని తాజాగా ఎకనామిక్ సర్వే (Economic Survey) వెల్లడించింది. దీనిని నియంత్రించడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సర్వే ప్రకారం.. మితిమీరిన స్క్రీన్ సమయం (Screen Time) పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో సోషల్ మీడియా వ్యసనం వల్ల ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), సైబర్ బెదిరింపు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ‘గేమింగ్ డిజార్డర్’ను ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది.
Also Read
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
Hyderabad Economy Growth: ప్రపంచ ఆర్థిక రంగంలో హైదరాబాద్ దూకుడు.. 2035 నాటికి దేశంలోనే!
నియంత్రణకు సూచనలు:
పిల్లలను ఈ డిజిటల్ ఊబి నుండి బయటపడేయడానికి సర్వే కొన్ని కీలక పరిష్కారాలను ప్రతిపాదించింది. అవి ఇలా ఉన్నాయి.
వయస్సు నిర్ధారణ: ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు కచ్చితమైన వయస్సు నిర్ధారణ ప్రక్రియను అమలు చేయాలి.
విద్యాపరమైన పరికరాలు: పిల్లలకు వినోదం కంటే కేవలం చదువుకు ఉపయోగపడే సాధారణ పరికరాలను (Simpler devices) అందించాలి.
డిజిటల్ వెల్నెస్: పాఠశాలల్లో ‘డిజిటల్ వెల్నెస్’ను పాఠ్యాంశంగా చేర్చాలి.
ప్రత్యామ్నాయాలు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత కోసం ఫిజికల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ హబ్లను ఏర్పాటు చేయాలి.
Tomato Prices Fall Down: రైతు కన్నీళ్లు.. భారీగా పతనమైన టమాటా ధర!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) ముప్పు:
డిజిటల్ వ్యసనంతో పాటు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, ప్యాక్డ్ స్నాక్స్ మొదలైనవి) కూడా పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని సర్వే పేర్కొంది. వీటిపై అధిక పన్నులు విధించాలని, పిల్లలకు సంబంధించిన మీడియాలో ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు వీటి ప్రకటనలను నిషేధించాలని సూచించింది.
తల్లిదండ్రుల పాత్ర:
కేవలం ప్రభుత్వాలే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా పిల్లల స్క్రీన్ సమయంపై నిఘా ఉంచాలి. ఇంట్లో డివైజ్ ఫ్రీ సమయాన్ని కేటాయించాలని, పిల్లలతో కలిసి ఆఫ్-లైన్ యాక్టివిటీస్లో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Pentagon Crisis: ఇరాన్తో యుద్ధం వేళ పెంటగాన్లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!