Child Digital Addict: మితిమీరిన స్క్రీన్ టైం.. పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం! సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Digital Addict: నేటి ఆధునిక కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకు బానిసలవ్వడం ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని తాజాగా ఎకనామిక్ సర్వే (Economic Survey) వెల్లడించింది. దీనిని నియంత్రించడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సర్వే ప్రకారం.. మితిమీరిన స్క్రీన్ సమయం (Screen Time) పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో సోషల్ మీడియా వ్యసనం వల్ల ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), సైబర్ బెదిరింపు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ‘గేమింగ్ డిజార్డర్’ను ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది.
Also Read
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
Hyderabad Economy Growth: ప్రపంచ ఆర్థిక రంగంలో హైదరాబాద్ దూకుడు.. 2035 నాటికి దేశంలోనే!
నియంత్రణకు సూచనలు:
పిల్లలను ఈ డిజిటల్ ఊబి నుండి బయటపడేయడానికి సర్వే కొన్ని కీలక పరిష్కారాలను ప్రతిపాదించింది. అవి ఇలా ఉన్నాయి.
వయస్సు నిర్ధారణ: ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు కచ్చితమైన వయస్సు నిర్ధారణ ప్రక్రియను అమలు చేయాలి.
విద్యాపరమైన పరికరాలు: పిల్లలకు వినోదం కంటే కేవలం చదువుకు ఉపయోగపడే సాధారణ పరికరాలను (Simpler devices) అందించాలి.
డిజిటల్ వెల్నెస్: పాఠశాలల్లో ‘డిజిటల్ వెల్నెస్’ను పాఠ్యాంశంగా చేర్చాలి.
ప్రత్యామ్నాయాలు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత కోసం ఫిజికల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ హబ్లను ఏర్పాటు చేయాలి.
Tomato Prices Fall Down: రైతు కన్నీళ్లు.. భారీగా పతనమైన టమాటా ధర!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) ముప్పు:
డిజిటల్ వ్యసనంతో పాటు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, ప్యాక్డ్ స్నాక్స్ మొదలైనవి) కూడా పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని సర్వే పేర్కొంది. వీటిపై అధిక పన్నులు విధించాలని, పిల్లలకు సంబంధించిన మీడియాలో ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు వీటి ప్రకటనలను నిషేధించాలని సూచించింది.
తల్లిదండ్రుల పాత్ర:
కేవలం ప్రభుత్వాలే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా పిల్లల స్క్రీన్ సమయంపై నిఘా ఉంచాలి. ఇంట్లో డివైజ్ ఫ్రీ సమయాన్ని కేటాయించాలని, పిల్లలతో కలిసి ఆఫ్-లైన్ యాక్టివిటీస్లో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!