Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో సెలబ్రిటీ లింక్?.. కాంతార నటుడిపై సిట్ ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Gold Theft Case: శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దోపిడీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో భాగంగా ప్రముఖ మలయాళ, తమిళ నటుడు జయరామ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించింది. ‘కాంతార’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన జయరామ్ పేరు ఈ వ్యవహారంలో రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని జయరామ్ నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజల గురించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ జరిగింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయాల గురించే అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది.
Also Read
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్కు ఉన్న పరిచయం ఈ విచారణలో కీలకంగా మారింది. ఉన్నికృష్ణన్ పొట్టి జయరామ్తో కలిసి ఎప్పుడు పూజలు చేశారు? ఆ సందర్భాల్లో జరిగిన లావాదేవీలు? లాంటి తదితర అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఆ కార్యక్రమాన్ని ఉన్నికృష్ణన్ పొట్టే నిర్వహించాడని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకొచ్చిన వస్తువులను బంగారం పూత పనులకు ఉపయోగించారని అధికారులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో సిట్ ప్రస్తుతం రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి, ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం తీసేశారా? రెండోది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమయ్యిందా? అన్న రెండు అంశాలపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు బి. మురళీబాబు, ఎస్. శ్రీకుమార్ ఉన్నారు. అయితే 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి చట్టపరమైన బెయిల్ లభించింది.
తాజావార్తలు
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!