Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో సెలబ్రిటీ లింక్?.. కాంతార నటుడిపై సిట్ ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Gold Theft Case: శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దోపిడీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో భాగంగా ప్రముఖ మలయాళ, తమిళ నటుడు జయరామ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించింది. ‘కాంతార’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన జయరామ్ పేరు ఈ వ్యవహారంలో రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని జయరామ్ నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజల గురించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ జరిగింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయాల గురించే అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది.
Also Read
- Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్కు ఉన్న పరిచయం ఈ విచారణలో కీలకంగా మారింది. ఉన్నికృష్ణన్ పొట్టి జయరామ్తో కలిసి ఎప్పుడు పూజలు చేశారు? ఆ సందర్భాల్లో జరిగిన లావాదేవీలు? లాంటి తదితర అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఆ కార్యక్రమాన్ని ఉన్నికృష్ణన్ పొట్టే నిర్వహించాడని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకొచ్చిన వస్తువులను బంగారం పూత పనులకు ఉపయోగించారని అధికారులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో సిట్ ప్రస్తుతం రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి, ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం తీసేశారా? రెండోది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమయ్యిందా? అన్న రెండు అంశాలపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు బి. మురళీబాబు, ఎస్. శ్రీకుమార్ ఉన్నారు. అయితే 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి చట్టపరమైన బెయిల్ లభించింది.
తాజావార్తలు
-
Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!