Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో సెలబ్రిటీ లింక్?.. కాంతార నటుడిపై సిట్ ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Gold Theft Case: శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దోపిడీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో భాగంగా ప్రముఖ మలయాళ, తమిళ నటుడు జయరామ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించింది. ‘కాంతార’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన జయరామ్ పేరు ఈ వ్యవహారంలో రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని జయరామ్ నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజల గురించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ జరిగింది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బంగారం పూత వేసిన రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయాల గురించే అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది.
Also Read
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్కు ఉన్న పరిచయం ఈ విచారణలో కీలకంగా మారింది. ఉన్నికృష్ణన్ పొట్టి జయరామ్తో కలిసి ఎప్పుడు పూజలు చేశారు? ఆ సందర్భాల్లో జరిగిన లావాదేవీలు? లాంటి తదితర అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఆ కార్యక్రమాన్ని ఉన్నికృష్ణన్ పొట్టే నిర్వహించాడని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకొచ్చిన వస్తువులను బంగారం పూత పనులకు ఉపయోగించారని అధికారులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో సిట్ ప్రస్తుతం రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి, ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం తీసేశారా? రెండోది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమయ్యిందా? అన్న రెండు అంశాలపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు బి. మురళీబాబు, ఎస్. శ్రీకుమార్ ఉన్నారు. అయితే 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి చట్టపరమైన బెయిల్ లభించింది.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!