NCP Reunion: అజిత్ పవార్ మరణం..ఎన్సీపీ కలయిక.. కీలకంగా సునేత్ర పవార్..
- ఫిబ్రవరిలో ఎన్సీపీ కలయిక..
- పార్టీ చీఫ్ రేసులో నలుగురు..
- శరద్ పవార్, సునేత్రా పవార్, సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Reunion: అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రెండు వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు, అజిత్ పవార్ మరణంతో ఫిబ్రవరిలో రెండు కలిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడించాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెండు వర్గాలు ఎన్సీపీ కలయికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈలోపే బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు.
Read Also: Salman Ali Agha: ప్రపంచ కప్లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
విలీనాన్ని ఖరారు చేయడానికి రెండు వర్గాల నాయకులు వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే, అజిత్ పవార్ వర్గానికి చెందిన కొంత మంది నాయకులు మాత్రం తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, దీనిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గానికి చెందిన వారు మాత్రం తక్షణ విలీనం కోసం ఎదురుచూస్తున్నాయి.
విలీన ప్రక్రియలో అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ కీలకంగా మారారు. విలీనం తర్వాత ఎన్సీపీకి చీఫ్గా శరద్ పవార్ కాకుండా, సునేత్ర పార్టీ అధ్యక్ష రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్సీపీలోని మెజారిటీ వర్గం సునేత్రా పవార్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ పార్టీ చీఫ్ రేసులో ప్రముఖంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం