ప్రస్తుతం దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB ) 2021కి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ప్రజలు ప్రేమలో ప్రాణాలు ఇవ్వరని, ప్రాణాలను తీసుకుంటారని తెలిసింది. తాజా NCRB డేటా ప్రకారం, భారతదేశంలో అత్యధిక హత్యలు జరగడానికి గల కారణాలలో, ప్రేమ వ్యవహారంలో హత్య కేసులు మూడవ స్థానంలో ఉన్నాయి. దేశంలో జరిగే ప్రతి పది హత్యల్లో ఒక హత్య ఎవరో ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చేసినవే.
Also Read : Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
2021 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 29 వేల 272 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ హత్యలన్నీ 19 వేర్వేరు కారణాలతో జరిగాయి. ఉదాహరణకు, వ్యక్తిగత శత్రుత్వం, మతపరమైన కారణాలు, రాజకీయ కారణాలు, మంత్రవిద్య, కులాంతర, వివాదాలు, దోపిడీ కేసుల్లో హత్య చేయబడినవే ఉక్కువగా ఉన్నాయి. అయితే ఈ 19 కారణాల్లో హత్యలు చేయబడిన దాంట్లో మూడో స్థానంలో ప్రేమ హత్యలు ఉన్నాయి. మొత్తం 29 వేల 272 హత్య కేసుల్లో 3125 కేసులు ప్రేమ వ్యవహారానికి సంబంధించినవే. వ్యక్తిగత శత్రుత్వం మరియు మతపరమైన కారణాలతో ఈ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Also Read : Delhi: సాక్షి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు
దేశంలో ప్రేమ వ్యవహారంతో పాటు అక్రమ సంబంధాల కారణంగా హత్యలు కూడా పెరిగాయి. NCRB యొక్క తాజా డేటా ప్రకారం, 2021లో, ప్రేమ మరియు అక్రమ సంబంధాల కారణంగా అత్యధిక హత్యలు జరిగిన రాష్ట్రాల్లో UP మొదటి స్థానంలో ఉంది. కాగా కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలన్నీ అట్టడుగున ఉన్నాయి. కానీ 2010 నుంచి, ప్రేమ, ద్రోహం మరియు అక్రమ సంబంధం కారణంగా హత్యల సంఖ్య వేగంగా పెరిగాయి. గత 10 ఏళ్లుగా ప్రేమ కారణంగా జరిగిన హత్యల లెక్కలు చూస్తే భారీగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ట్రెండ్ పెరగడంతో ప్రేమ రక్తసిక్తంగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
ఈ గణాంకాల ప్రకారం 2010 నుంచి 2014 మధ్య ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన హత్యల శాతం 7-8 శాతం మధ్య నమోదైంది. కానీ 2015 నుంచి 21 మధ్య కాలంలో హఠాత్తుగా ప్రేమ వ్యవహారం కారణంగా హత్యల శాతం 10 నుంచి 11 శాతానికి పెరిగింది. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. NCRB యొక్క మరొక డేటా ప్రకారం, 2021లో దేశంలో జరిగిన మొత్తం 29 వేల 272 హత్యలలో, 95 శాతం పెద్దలు కాగా, 5 శాతం పిల్లలు. హత్యకు గురైన వారిలో 73 శాతం మంది పురుషులు కాగా, 26 శాతం మంది మహిళలు. ఇది కాకుండా 2021లోనే 10 మంది ట్రాన్స్జెండర్లు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో 5 ఏళ్ల చిన్నారి నుంచి 74 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు.
Also Read : AP CM Jagan: నేడు సీఎం జగన్ గుంటూరు పర్యటన
ప్రేమలో జరిగిన హత్యే కాకుండా భార్యాభర్తల గొడవల్లో ఎన్నో హత్యలు జరిగాయి. ఈ హత్యలకు వివాహేతర సంబంధాలే కారణం. ఒక లెక్క ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా దాదాపు 270 భర్తలను చంపిన కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో దాదాపు 250 వరకు భార్యను భర్త హత్య చేసిన కేసులు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ గణాంకాలు చాలా భయానకంగా ఉన్నాయి.