NCRB: దేశంలో పెరుగుతున్న ప్రేమ హత్యలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీఆర్బీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB ) 2021కి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ప్రజలు ప్రేమలో ప్రాణాలు ఇవ్వరని, ప్రాణాలను తీసుకుంటారని తెలిసింది. తాజా NCRB డేటా ప్రకారం, భారతదేశంలో అత్యధిక హత్యలు జరగడానికి గల కారణాలలో, ప్రేమ వ్యవహారంలో హత్య కేసులు మూడవ స్థానంలో ఉన్నాయి. దేశంలో జరిగే ప్రతి పది హత్యల్లో ఒక హత్య ఎవరో ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చేసినవే.
Also Read : Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Also Read
2021 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 29 వేల 272 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ హత్యలన్నీ 19 వేర్వేరు కారణాలతో జరిగాయి. ఉదాహరణకు, వ్యక్తిగత శత్రుత్వం, మతపరమైన కారణాలు, రాజకీయ కారణాలు, మంత్రవిద్య, కులాంతర, వివాదాలు, దోపిడీ కేసుల్లో హత్య చేయబడినవే ఉక్కువగా ఉన్నాయి. అయితే ఈ 19 కారణాల్లో హత్యలు చేయబడిన దాంట్లో మూడో స్థానంలో ప్రేమ హత్యలు ఉన్నాయి. మొత్తం 29 వేల 272 హత్య కేసుల్లో 3125 కేసులు ప్రేమ వ్యవహారానికి సంబంధించినవే. వ్యక్తిగత శత్రుత్వం మరియు మతపరమైన కారణాలతో ఈ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Also Read : Delhi: సాక్షి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు
దేశంలో ప్రేమ వ్యవహారంతో పాటు అక్రమ సంబంధాల కారణంగా హత్యలు కూడా పెరిగాయి. NCRB యొక్క తాజా డేటా ప్రకారం, 2021లో, ప్రేమ మరియు అక్రమ సంబంధాల కారణంగా అత్యధిక హత్యలు జరిగిన రాష్ట్రాల్లో UP మొదటి స్థానంలో ఉంది. కాగా కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలన్నీ అట్టడుగున ఉన్నాయి. కానీ 2010 నుంచి, ప్రేమ, ద్రోహం మరియు అక్రమ సంబంధం కారణంగా హత్యల సంఖ్య వేగంగా పెరిగాయి. గత 10 ఏళ్లుగా ప్రేమ కారణంగా జరిగిన హత్యల లెక్కలు చూస్తే భారీగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ట్రెండ్ పెరగడంతో ప్రేమ రక్తసిక్తంగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
ఈ గణాంకాల ప్రకారం 2010 నుంచి 2014 మధ్య ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన హత్యల శాతం 7-8 శాతం మధ్య నమోదైంది. కానీ 2015 నుంచి 21 మధ్య కాలంలో హఠాత్తుగా ప్రేమ వ్యవహారం కారణంగా హత్యల శాతం 10 నుంచి 11 శాతానికి పెరిగింది. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. NCRB యొక్క మరొక డేటా ప్రకారం, 2021లో దేశంలో జరిగిన మొత్తం 29 వేల 272 హత్యలలో, 95 శాతం పెద్దలు కాగా, 5 శాతం పిల్లలు. హత్యకు గురైన వారిలో 73 శాతం మంది పురుషులు కాగా, 26 శాతం మంది మహిళలు. ఇది కాకుండా 2021లోనే 10 మంది ట్రాన్స్జెండర్లు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో 5 ఏళ్ల చిన్నారి నుంచి 74 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు.
Also Read : AP CM Jagan: నేడు సీఎం జగన్ గుంటూరు పర్యటన
ప్రేమలో జరిగిన హత్యే కాకుండా భార్యాభర్తల గొడవల్లో ఎన్నో హత్యలు జరిగాయి. ఈ హత్యలకు వివాహేతర సంబంధాలే కారణం. ఒక లెక్క ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా దాదాపు 270 భర్తలను చంపిన కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో దాదాపు 250 వరకు భార్యను భర్త హత్య చేసిన కేసులు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ గణాంకాలు చాలా భయానకంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!