AP CM Jagan: నేడు సీఎం జగన్ గుంటూరు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan Guntur Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గం టలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తొలుత గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని.. అక్కడ నుంచి చుట్టుగుంటకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వె స్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నా రు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వా త జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు.
Also Read
Read Also: BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..
ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటుచేస్తోంది. పంటల సరళి, స్థానిక డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాల ఎంపిక, కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రైతు గ్రూపులకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యంత్ర పరికరాలు, వాటి అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. కనీసం 15 రోజుల ముందుగా మండల పరిధిలో ఏ ఆర్బీకే నుంచైనా బుక్ చేసుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ సీహెచ్సీ’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గ్రూపులకు వచ్చే ఆదాయం, రుణాల చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వీటి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో డాష్ బోర్డునూ ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..