Hemant soren: సుప్రీంలో హేమంత్ బెయిల్ పిటిషన్లు ఉపసంహరణ.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన ఇండియా కూటమి తరపున ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..
Also Read
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ను జనవరిలో అరెస్ట్ చేసింది. అప్పటినుంచి ఆయన జైల్లో ఉన్నారు. వాస్తవాలను బహిర్గతం చేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. బెయిల్ పిటిషన్లు రద్దయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ముందుగానే మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. హేమంత్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: AP CEO MK Meena: ఏ1 నిందితుడిగా పిన్నెల్లి.. పది సెక్షన్ల కింద కేసులు
మధ్యంతర బెయిల్ పిటిషన్పై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కపిల్ సిబల్ను కోర్టు అనేక కఠినమైన ప్రశ్నలను అడిగింది. హేమంత్ ముఖ్యమంత్రిగా కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఆరోపించింది. దీంతో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై సుప్రీం ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్ను ఉపసంహరిచుకున్నారు. దీంతో సోరెన్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్లో 14 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు దశల్లో ఏడింటికి పోలింగ్ పూర్తయింది. మిగిలిన ఆరు స్థానాలకు మే 25న, ఏడో స్థానానికి జూన్ 1న ఓటింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Katrina Kaif : కత్రీనా కైఫ్ బేబీ బంప్స్ ఫొటోస్ వైరల్..
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!