Uttarpradesh : ప్రియుడి కోసం కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చిన యువతి.. ఈ తర్వాత
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ పరిమళ ద్రవ్యాల సువాసనకు ప్రసిద్ధి. అయితే ఈ కన్నౌజ్ ప్రస్తుతం మరో విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ 17 ఏళ్ల అమ్మాయి తన ప్రేమికుడి ఆదేశాల మేరకు తన కుటుంబాన్ని మొత్తం చంపాలని ప్లాన్ చేసింది. సోమవారం రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడిని ఇంటికి ఆహ్వానించింది. ప్రియుడి సాయంతో ఆ యువతి మొదట పదునైన బ్లేడుతో తండ్రి గొంతు కోసింది. అనంతరం సోదరుడిపై సుత్తితో దాడి చేశారు.
దీంతో దెబ్బలకు తాళలేక సోదరుడు కళ్లు తెరిచాడు. నొప్పి భరించలేక అరవడం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ కారణంగా అమ్మాయి.. ఆమె ప్రేమికుడిని పట్టుకున్నారు. గాయపడిన తండ్రిని గ్రామస్థులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన చిబ్రమౌ కొత్వాలిలోని ఘిసువాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు యువతితో పాటు తన ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని పోలీసులు తమ స్టైల్లో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. కుటుంబాన్ని హత్య చేసేందుకు ఎందుకు కుట్ర పన్నారో తెలిపింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి 50 ఏళ్ల అజయ్ పాల్ రాజ్పుత్ గ్రామాభివృద్ధి అధికారి (కార్యదర్శి)గా పనిచేస్తున్నారు.
Also Read
Read Also:Hema: రెండ్రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీపై హేమ కీలక వ్యాఖ్యలు
యువతి మాట్లాడుతూ, ‘నేను కాకుండా కుటుంబంలో ఇద్దరు సోదరులు, తల్లి ఉన్నారు. తల్లి పేరు మోని దేవి, అన్నయ్య సిద్ధార్థ్ (18), నాకంటే చిన్నవాడు అమన్ (14) ఉన్నారు. హిమాన్షు యాదవ్ అనే అబ్బాయితో నాకు ఎఫైర్ ఉంది. కానీ మా నాన్నకు ఇది అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో నన్ను తిట్టాడు కూడా. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. అతి కష్టం మీద హిమాన్షుని కలిసినప్పుడు విషయం మొత్తం చెప్పాను. అప్పుడు హిమాన్షు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. మా ప్రేమకు నా కుటుంబం అడ్డుగా మారితే కుటుంబమే నాశనం కావాలి అని అన్నారు.
అందుకే మా కుటుంబాన్ని హతమార్చేందుకు మేం పూర్తి ప్లాన్ చేశామని నిందితురాలు తెలిపింది. సోమవారం హత్యకు ఫిక్స్ అయ్యాను. రాత్రి భోజనంలో నిద్ర మందు కలిపి ఇచ్చాను. అందరూ రాత్రి భోజనం చేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. నేను నా కుక్క ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాను. మేం హత్య చేసేటప్పుడు అరవకుండా ఉంటుందని అలా చేశాను. అప్పటికి రాత్రి రెండు గంటలు. హిమాన్షుకి ఫోన్ చేశాను. ముందుగా పదునైన బ్లేడుతో తండ్రి గొంతు కోశాను. ఆ తర్వాత అన్నయ్య గదిలోకి వెళ్లాం. అతనిపై సుత్తితో దాడి చేశాం. కానీ అతను నిద్ర ఎలా పోగొట్టుకున్నాడో తెలియదు. నిద్రలేచి అరవడం మొదలుపెట్టాడు. పట్టుబడతామని అనుకున్నాం. దాంతో మేమిద్దరం అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాం. అయితే గ్రామస్తులు మమ్మల్ని పట్టుకున్నారు.’ అంటూ పూసగుచ్చినట్లు చేసిన నేరం గురించి పోలీసులకు తెలిపింది.
Read Also:Janhvi Kapoor: ‘దేవర’లో తన పాత్రను రివీల్ చేసిన జాన్వీ కపూర్!
గాయపడిన సిద్ధార్థ్ను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితుల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, సంఘటన జరిగిన మరుసటి రోజు పెంపుడు కుక్క కూడా స్పృహలోకి వచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో