Harish Rao: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది..
- దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి
- తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, యువతులకు స్కూటీలు ఏమయ్యాయి
- రేవంత్ రెడ్డి హామీలు సగం.. సగం.. ఆగం ఆగం.. అయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “సేవాలాల్ జయంతి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ప్రకటించారు.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.. బంజారా భవన్ ఏర్పాటు చేశారు, తండాలను గ్రామపంచాతీలుగా ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు.. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, యువతులకు స్కూటీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీలు సగం.. సగం.. ఆగం ఆగం.. అయ్యాయి.. దేవుళ్ళను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాదని అన్నారు.
Also Read:Hyderabad: హైదరాబాద్లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
Also Read
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
- రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
పాలమూరు బిడ్డ, నల్లమల బిడ్డ అనే రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేదు.. రైతు బంధు వర్ష కాలంలో 8 వేల కోట్లు, యాసంగిలో 4 వేల కోట్లను ప్రజలకు ఎగ్గొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి.. కరోనా సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయమే ముఖ్యం.. అయితే లూటీ లేకుంటే లాఠీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరున వేల ఎకరాల భూమిని లాక్కుంటున్నారు.. 16 నెలల అవుతున్న పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు.. కేసీఆర్ కిట్టు, రమజాన్ టోఫా, రైతు బంధు, ఫీజు రీయింబర్స్ మెంట్ లు బంద్ చేశారని మండిపడ్డారు.
Also Read:Australia: స్టేజ్ పైనుంచి కింద పడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ
గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. HCU, ప్రభుత్వ భూములు అమ్ముకోవడమే రేవంత్ రెడ్డి పని.. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపిన రేవంత్ రెడ్డి.. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మోసం చేశారు.. దమ్ముంటే గన్మెన్లు, పోలీసులు లేకుండా బోయిన్ గుట్ట తండాకురా…రుణమాఫీ అయిందా లేదా చెబుతారు అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
-
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
-
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!